Kerela: టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దాంతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తూనే ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ ని ఎక్కువ శాతం ఉపయోగిస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్లతో గంటలు గంటలు టైం స్పెండ్ చేస్తున్నారు. తాజాగా ఒక స్మార్ట్ ఫోన్ ఒక చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది.. అసలేం జరిగిందంటే… కేరళ త్రిస్సూర్కు చెందిన 8 ఏళ్ల బాలిక ఫోన్లో సినిమా చూస్తుండగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఫోన్ పేలిపోయింది.
దాంతో ఆ బాలిక మృతి చెందింది. ఇక ఆ విషయంపై ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో భాగంగా ఫోరెన్సిక్ టీమ్ కూడా రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే రెడ్మీ కంపెనీకి చెందిన ఫోన్ పేలడం వల్లనే బాలిక మరణించిందనే వార్తలు పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అయితే తాజాగా బాలిక మృతి పట్ల స్పందించిన రెడ్ మీ కంపెనీ వారి కంపెనీకి చెందిన ఫోన్ పేలిన కారణంగానే బాలిక మృతి చెందిందన్న వార్తలను రెడ్మీ ఖండించింది.
బాలిక మృతిపై వస్తున్న వార్తలు కేవలం ఆరోపణలు మాత్రమే అని ఫోన్ పేలడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది రెడ్మి సంస్థ. బాలిక మృతిపై విచారణ పూర్తయ్యే వరకు దర్యాప్తులో భాగంగా అధికారులకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. కస్టమర్ల సేఫ్టీ మాకు ముఖ్యం. వారి భద్రత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటాంము. బాలిక మృతితో క్లిష్టపరిస్థితుల్లో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలుస్తాము. మా ఫోన్ పేలడం వల్లనే బాలిక మృతి చేందింది అనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంలో విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. బాలిక మృతికి గల అసలు కారణాలమేిటో తెలుసుకునే క్రమంలో అధికారులకు పూర్తిగా సహకరిస్తాం అంటూ రెడీమీ ఒక ప్రకటనను విడుదల చేసింది.