Dil Raju: సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా తన హవా నడిపిస్తున్నారు దిల్రాజు. ఆయన వెనుక ఉండి శిరీష్ రెడ్డి.. సినీ నిర్మాణం, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాలను గుప్పిట్లో పెట్టుకున్నారు. అల్లు అరవింద్, యువీ వంశీ ఇంకా జిల్లాల్లో కీలకమైన పంపిణీదారులను కలుపుకొని మొత్తం ఎగ్జిబిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రంగాన్ని గుప్పిట్లో ఉంచుకున్నారు. ఏ సినిమాకు ఏ రేటు డిసైడ్ చేయాలంటే వీరి చేతుల్లోనే ఉంటుంది. ఒక్క సారి రేట్ ఫిక్స్ అయ్యాక.. అంతకు మించి పెరగదు, తగ్గదు. అలాగే ఏ డేట్కి రిలీజ్ చేయాలని అనుకుంటే ఆ తేదీకే విడుదల చేస్తాను. అయితే వీళ్లందరి తరఫున మొత్తం చక్రం తిప్పేది మాత్రం దిల్ రాజే.
సురేశ్ బాబు – ఆసియన్ సునీల్ ఈ సిండికేట్లో భాగస్వామ్యం కాలేదు. అయితే ఎక్కువ సినిమాల పంపిణీ దిల్ రాజు దగ్గరే ఉంటాయి. నైజాంలో వాళ్ల థియేటర్కు బిజినెస్ కావాల్సి ఉండటంతో.. వీరు చేతులు కలుపక తప్పడం లేదు. ఈ విషయం టాలీవుడ్ యంగ్ జనరేషన్కు అస్సలు నచ్చడం లేదు. గిల్డ్ సమ్మె సమయంలో కాస్త నిరసన తగిలింది. గిల్డ్ సమ్మె సమయంలో తన సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని, మిగిలిన సినిమాలను బంద్ చేయించారు. అప్పటి నుంచి దిల్ రాజుపై టాలీవుడ్లో అసంతృత్తి మొదలైంది. టాలీవుడ్లో కొంచెం కొంచెంగా హీరోలు దిల్ రాజును దూరం పెడుతున్నట్లు సమాచారం. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు పద్ధతికి మహేష్ బాబుకు కోపం కూడా వచ్చిందట.
దాంతో తన తర్వాతి సినిమా హక్కులు దిల్ రాజుకు ఇవ్వడానికి వీలులేదని ముందు చెప్పినట్లు సమాచారం. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ముందునుంచే దిల్ రాజును దూరం పెడుతూ వస్తున్నారు. అల్లు అర్జున్ కూడా దిల్రాజును దూరం పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు చేతిలో ఉన్న ఏమైన పెద్ద సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్దే. కానీ ఈ సినిమా ముందుకు స్టార్ట్ అవ్వడానికి టైం పట్టేలా కనిపిస్తోంది. నిజానికి అందరూ దిల్ రాజును టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ థియేటర్ల వ్యవహారంలో దిల్ రాజుకు సంబంధం లేదు. అన్ని పనులు దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి చూసుకుంటారు. థియేటర్లు, డిస్ట్రిబ్యూషన్ విషయాల్లో శిరీష్ రెడ్డి చాలా రాష్గా వ్యవహరిస్తారని సమాచారం. శిరీష్ రెడ్డి వ్యవహారం వల్లే ఇప్పుడు ఇండస్ట్రీలో దిల్ రాజుపై వ్యతిరేకత ఎదురైంది. త్వరలో దిల్ రాజు-శిరీష్ వ్యవహారం విషయంలో టాలీవుడ్లో బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.