Bangalore: సరదాగా బయటికి వెళ్లిన స్టూడెంట్.. అతను చేసిన పనికి?

Bangalore: చావు ఎప్పుడు ఎటునుంచి ఏ రూపంలో వస్తుందో చెప్పడం అంచనా వేయడం చాలా కష్టం. ఈ మధ్యకాలంలో ఊహించని విధంగా ఎక్కువగా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చాలా వరకు యువతనే ప్రమాదవశాత్తు మరణిస్తున్నారు. తాజాగా అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. తాజాగా బెంగుళూరు లోని కర్ణాటక కాలేజీలో పూజ, ఇమ్రాన్, రాధిక, చన్నారం, సునీతతో పాటు బికాష్‌లు అనే విద్యార్థులు డీ ఫార్మసీ కోర్సు చదువుతున్నారు.

వీళ్లిందరూ స్నేహితులు కావడంతో కాలేజ్ బంక్ కొట్టి సరదాగా ఒక రోజు బయటకు వెళ్లాలని అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఆ ఆరుగురు బక్ లపై శ్రీనివాస సాగర్‌ డ్యాం చూడటానికి చిక్కబళ్లాపూర్‌ వెళ్లారు. మధ్యాహ్నం సమయానికి అక్కడికి చేరుకున్నారు. ఎండతీవ్రత అధికంగా ఉండడంతో ఆ నీటిని చూసి ఆ యువకుడు ఈత కొడదామని అనడంతో అందరు దానికి సరే అని అన్నారు. మొదట పూజ, ఇమ్రాన్, రాధిక నీటిలోకి దిగారు. వీరిని చూసిన మిగతా ముగ్గురు విద్యార్థులు కూడా ఒకరి తర్వాత ఒకరు ఆ నీటిలో దిగారు.

 

కొద్దిసేపు అందరూ నీటిలో ఒకరి చేతులు ఒకరు పట్టుకుని సంతోషంగా మురిసిపోయారు. అయితే అలాగే కొద్దిగా ముందుగా వెళ్లగానే కాస్త లోతుగా ఉండడంతో పూజ, ఇమ్రాన్, రాధిక నీటి లోపలికి వెళ్లిపోయారు. ఎంతకు వారు పైకి రాకపోవడంతో మిగతా ముగ్గురు స్నేహితులు వారిని కాపాడే ప్రయత్నం చేయబోయారు. ఆ సమయంలో ఈ విద్యార్థులకు ఏం చేయాలో తెలియక భయంతో బయటకు వచ్చారు.

 

అనంతరం వారు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత పూజ యువతి మృతదేహం లభ్యమైంది. పూజ, ఇమ్రాన్, రాధిక చనిపోయారని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకుని గుండెలు పగిలేలా ఏడ్చారు. ఇక పోలీసులు మిగతా ఇద్దరి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -