Mancherial: ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా చాలామంది ప్రేమించమంటూ వెనక పడటం లేదంటే చంపేయడం యాసిడ్ దాడి చేయడం లాంటివి చేస్తున్నారు. కొందరు దుర్మార్గులు పెళ్లయిన వివాహితలను సైతం వదిలిపెట్టడం లేదు. కొందరు అటువంటి విషయాలను బయట పెడుతుండగా ఇంకొందరు మాత్రమే ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. తాజాగా ఒక యువకుడు ప్రేమ పేరుతో మహిళను వేధిస్తుండడంతో కుటుంబ సభ్యులు అతనిని దారుణంగా హత్య చేసి చంపేశారు. అసలేం జరిగిందంటే..
మంచిర్యాల జిల్లా జైపుర్ మండలం ఇందారంలో మహేష్ అనే యువకుడు పెళ్లయిన వివాహితను ప్రేమతో వేధిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఆ వివాహేతకు మహేష్ అసభ్య మెసేజ్ లు పంపడంతో పోలీస్ స్టేషన్లలో మహిళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా మహేష్ తన బుద్ధిని మార్చుకోకపోగా అలాగే వేధింపులు చేయడం మొదలుపెట్టాడు. దాంతో ఎలా అయినా మహేష్ కి యువతీ కుటుంబ సభ్యులు బుద్ధి చెప్పాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే కోపంతో ఊగిపోయిన యువతి కుటుంబ సభ్యులు మహేష్ను దారుణంగా రాయితో కొట్టి చంపేశారు.
నడిరోడ్డు పైన అందరూ చూస్తుండగానే యువకుడి తలను ఒక వ్యక్తి రాయితో ఛిద్రం చేసాడు. తనని వేధిస్తున్నాడు అన్న నేపంతో సదరు వివాహిత తన తల్లి సోదరుడు మరొక వ్యక్తితో కలిసి మహేష్ ని దారుణంగా హత్య చేయించింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఘటనతో ఒక్కసారిగా ప్రాంతంలో ఉన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటికి ఆ యువకుడు కుటుంబ సభ్యులు కూడా అక్కడికి చేరుకోవడంతో అక్కడంతా ఉద్రిక్తత నెలకొంది. మహేష్ ని హత్య చేసిన ఆ నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఇక మహేష్ ఆ విధంగా చూసిన కుటుంబ సభ్యులు గుండెలు వెలసిన రోదిస్తున్నారు. వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలి అని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పట్టపగలే నడిరోడ్డుపై ఘోరం చోటు చేసుకోవడంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.