Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతమంది కమెడియన్స్ మరే సినీ పరిశ్రమలో లేరు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ రాను రాను కమెడియన్లు ఒక్కొక్కరు సినిమా ఇండస్ట్రీకి దూరం అవడంతో ఇటీవల ఎక్కువమంది కమెడియన్ లు మాత్రమే మనకు సినిమాలలో కనిపిస్తున్నారు మంది కనిపిస్తున్నారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉప్పలపాడు కమెడియన్స్ సినిమాలలోని కొన్ని సన్నివేశాలలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మరి సినిమాలోని సన్నివేశాలు అద్భుతంగా నటించిన ఆ కమెడియన్లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బ్రహ్మానందం.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కాగా బ్రహ్మానందం ఇటీవలే రంగమార్తాండ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరి హృదయాల్ని బరువెక్కించేలా నటించి మెప్పించారు బ్రహ్మానందం. కమెడియన్ కోవై సరళ గురించి మనందరికీ తెలిసిందే. కమెడియన్ బ్రహ్మానందం కోవై సరళ కాంబినేషన్లో ఎటువంటి సందేశం వచ్చినా అది సూపర్ హిట్ అని చెప్పవచ్చు. తమిళంలో ఆమె నటించిన చిత్రం సెంబి మనవరాలికి జరిగిన అన్యాయంపై పోరాటం చేసే బామ్మగా వీరతల్లి పాత్రలో కోవై సరళ నటన నభూతో కొన్ని సన్నివేశాలు చూస్తే థియేటర్లో ప్రేక్షకుడికి కన్నీళ్లు రాకుండా ఉండవు.
ఇక ప్రముఖ హాస్య నటుడు సునీల్ గురించి మనందరికీ తెలిసిందే. హీరో గానే కాకుండా కమెడియన్ గా కూడా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు సునీల్. డిస్కోరాజా, కలర్ ఫోటో సినిమాలలో విలన్ గా అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాలో విలన్ గా నటించే మరింత ఫాలోయింగ్ ని ఏర్పరచుకున్నాడు సునీల్. తమిళంలో హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించి మెప్పిస్తున్నారు సూరి. విదుతలై పార్ట్ 1 సినిమాలో చూపించారు. వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలలో ఎక్కువగా నటిస్తున్న కమెడియన్ప్రియదర్శి. గతంలో మల్లేశం సినిమాతో అలరించిన ఆయన ఇటీవల బలగం లో కూడా అద్భుతంగా నటించాడు ప్రియదర్శి.
నటుడు సత్యం రాజేష్ గురించి కూడా మనందరికీ తెలిసిందే. మా ఊరి పొలిమేర వెబ్ సిరీస్లో నటించి ప్రేక్షకులను అలదించారు. ఇందులో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు సత్యం రాజేష్. అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కెరీర్లో గుర్తుండిపోయే అతి కొద్ది సినిమాల్లో గూఢచారి మూవీ కూడా ఒకటి. ఇందులో అద్భుతంగా నటించి మెప్పించాడు. జబర్దస్త్ కమెడియన్ వేణు గురించి మనందరికీ తెలిసిందే. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు, ఇటీవల బలగం సినిమాతో దర్శకుడుగా మారి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు. ఈ సినిమాతో వేణు క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.