Tollywood: ఈ సెలబ్రెటీల మధ్య మంచి స్నేహం ఉందని మీకు తెలుసా?

Tollywood: ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా.. మన చుట్టూ చాలామంది ఉన్న కూడా మనకంటూ చెప్పుకోవడానికి స్నేహితులుగా ఒకరు లేదా ఇద్దరిని మాత్రమే చెప్పుకుంటాం. అందుకు కారణం ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడం.. ఒకరికి మరొకరు సపోర్టుగా ఉండి ధైర్యం చెప్పడం.

ఏవైనా పర్సనల్ విషయాలు ఉంటే అది కచ్చితంగా అత్యంత క్లోజ్ గా ఉండే స్నేహితుడితో పంచుకొని సలహాలు తీసుకుంటాం. స్నేహం అనేది చాలా గొప్పది, పవిత్రమైనది. మనకు ఉన్న అన్ని బంధాలు ముందుగానే ఏర్పడి ఉంటాయి కానీ ఒక స్నేహితుడిని మాత్రం మనమే సెలెక్ట్ చేసుకుంటాం.

ఇక తెలుగు ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితంగా, స్నేహితులుగా ఉన్న సెలబ్రిటీల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వీరిద్దరూ మంచి స్నేహితులుగా చెప్పుకోవచ్చు. ఇద్దరూ ఎక్కడ కలిసి చాలా సన్నిహితంగా మాట్లాడుకోవడం. నాగార్జున, చిరంజీవి ఇంటికి వెళ్లినప్పుడు స్వయంగా వంటచేసి, తన చేతితోనే వడ్డించడం. వీరి స్నేహానికి నిదర్శనం.

ఇక దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి వీరిద్దరూ కూడా సినీ ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా చెప్పుకోవచ్చు.

ఇక రెబల్ స్టార్ ప్రభాస్, అల్లు అర్జున్ వీరిద్దరి మధ్య కూడా మంచి స్నేహం ఉంది. ఎక్కడ కనిపించినా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు.

ఇక పవర్ స్టార్ రామ్ చరణ్, శర్వానంద్ ఇద్దరు కూడా మంచి మిత్రులు. చిన్నప్పటినుండే వీరు స్నేహితులుగా ఏర్పడి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు.

ఇక జూనియర్ ఎన్టీఆర్, నటుడు రాజీవ్ కనకాల వీరిద్దరి మధ్య కూడా మంచి స్నేహం ఉంది. వీరిద్దరూ కలిసి సరదాగా క్రికెట్ ఆడడం. కలిసి టైం స్పెండ్ చేయడం, ఎక్కడ కనిపించినా అన్నదమ్ములు లాగా కనిపిస్తూ ఉంటారు.

ఇక హీరో రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్ మధ్య కూడా మంచి స్నేహం ఉంది.

హీరో శ్రీకాంత్, నటుడు శివాజీ మధ్య కూడా మంచి స్నేహం ఉంది. ఎక్కడ కనిపించినా వీరు కూడా సన్నిహితంగా మెలగడం జరుగుతుంది.

హీరో, సహాయ నటుడైన సునీల్ కు దర్శకుడు త్రివిక్రమ్ కు మంచి స్నేహం ఉంది ఏ ఫంక్షన్ లో కనిపించిన ఇద్దరు సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇక డైరెక్టర్ వివి వినాయక్, డైరెక్టర్ తేజ కూడా మంచి స్నేహితులుగా చెప్పుకోవచ్చు.

ఏ ఫంక్షన్లో అయినా పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటారు.హీరో అఖిల్, హీరో నితిన్ కూడా చాలా కాలం నుండి మంచి స్నేహితులు. ఇలా తెలుగు ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -