Sr NTR: సీనియర్ ఎన్టీఆర్‌ను బాలయ్య, హరికృష్ణ తిట్టడానికి కారణాలివే?

Sr NTR: తెలుగు ప్రజల ఆశాజ్యోతి, టాలీవుడ్ ఇండస్ట్రీకి మకుఠం లేని మహారాజు ఎవరంటే సీనియర్ ఎన్టీఆర్ అనే చెప్తారు. అప్పట్లో తెలుగు సినిమా అభివృద్ధి కోసం, టాలీవుడ్ ఇండస్ట్రీని మంచి గుర్తింపు తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారు. టాలీవుడ్‌లో నిర్మాతగా, హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చిన సీనియర్ ఎన్టీఆర్.. ఓ సామాన్యుడిలా సంచలనం సృష్టించాడు. సినిమా పరంగా, రాజకీయాల పరంగా తిరుగులేని ఫాలొయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఆయన తర్వాత తరంలో వచ్చిన బాలకృష్ణ కూడా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇంత ఆస్తి, పేరు, ప్రతిష్టలు సంపాదించుకున్న ఎన్టీఆర్‌ ఒక్క విషయంలో ఎంతో బాధ పడేవారంట. ఎన్టీఆర్ పిల్లలెవరూ పెద్దగా చదువుకోలేదు. కేవలం ఒకరిద్దరు మాత్రమే చదువుకున్నారు. మిగిలిన ఎవరికీ చదువు అబ్బలేదంట. దీంతో ఎన్టీఆర్ ఎంతో బాధపడేవారట. అయితే ఎన్టీఆర్ మాత్రం తన పిల్లలను అమెరికాలో చదివిస్తున్నట్లు చెప్పుకుని తిరిగేవారు. కానీ వారు హైదరాబాద్ కూడా దాటి బయటికి వెళ్లలేదు. దీనిపై ఎన్టీఆర్‌ ఎన్నో నిందలు కూడా పడ్డారని సమాచారం.

 

 

సినిమా మోజులో పడి ఎన్టీఆర్ పిల్లల చదువుపై అశ్రద్ధ వహించారని ఆయనపై విమర్శలు వచ్చాయి. అలా హరికృష్ణ, బాలయ్య కూడా ఎన్టీఆర్ వెంట వచ్చేవారు. ఇంట్లో ఆడపిల్లలు కూడా పెద్దగా చదువుకోలేదు. ఈ విషయంపై పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ఇంట్లో గొడవలు కూడా జరిగాయి. అప్పుడు ఎన్టీఆర్‌పై బాలకృష్ణ, హరికృష్ణ కూడా తనపైనే రివర్స్ అయ్యారని సమాచారం. మీ వల్లనే చదువుకోలేకపోయామని పిల్లలు బాధపడ్డారట. కానీ ఎన్టీఆర్ మాత్రం పిల్లలు చదువుకోకపోయినా.. తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కష్టాలు లేకుండా కాలం వెల్లదీస్తున్నట్లు అనుకునేవారట. అయితే ఎన్టీఆర్ పిల్లలకు మంచి చదువు చదివించనప్పటికీ.. వారికి పెళ్లి చేసేటప్పుడు మాత్రం విద్యావంతులకు ఇచ్చి వివాహం చేశారు. అలా తన తప్పును సరిదిద్దుకున్నారని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: అవినాష్ రెడ్డి ఏ తప్పు చేయలేదా.. అలా అయితే హత్య చేసిందెవరో చెప్పు జగన్?

CM Jagan:  ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల పులివెందులలో నిర్వహించినటువంటి సభలో వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్నాన్న వివేకం బాబాయ్ కి...
- Advertisement -
- Advertisement -