KA Paul: జనసేనను 5000 కోట్లకు అమ్మేయాలని చూస్తున్నారు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు!

KA Paul: తాజాగా కిలారి ఆనంద‌పాల్‌ జ‌న‌సేన‌పై సంచ‌లన వ్యాఖ్య‌లు చేశారు. ప‌వ‌న్ కళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీని అమ్మేయాల‌ని బేరం పెట్టార‌ని, దాదాపు 5000 కోట్ల రూపాయ‌ల‌కు బీజేపీ అమ్మేయాల‌ని భావించార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ విష‌యంపై చిరంజీవి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇద్ద‌రూ చ‌ర్చించుకున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.


విజ‌య‌వాడ‌లో తాజాగా ప‌ర్య‌టించిన ఆనందపాల్‌.. ఇక్క‌డ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అ సందర్బంగా పాల్ మాట్లాడుతూ..నేను మొద‌టి నుంచి చెబుతూనే ఉన్నాను. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు పార్టీ న‌డ‌ప‌డం చేత‌కాదు. అందుకే జ‌న‌సేనను బీజేపీలో క‌లిపేయాల‌ని భావిస్తున్నారు.

 

దీనికి సంబంధించి నా ద‌గ్గ‌ర ఆధారాలు కూడా ఉన్నాయి. చిరంజీవి-ప‌వ‌న్ ఇద్ద‌రూ క‌లిసి జ‌న‌సేన‌ను బీజేపీలో క‌లిపేయాల‌ని చూస్తున్నారు. జనసేన పార్టీని దాదాపుగా 5000 కోట్ల‌కు అమ్మేయాల‌ని చూస్తున్నారని పాల్ వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్య‌వ‌హారం వెనుక‌ గ‌తంలో ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయించిన చిరంజీవి బావ‌మ‌రిది అల్లు అర‌వింద్ కీల‌క పాత్ర పోషించార‌ని పాల్ చెప్పుకొచ్చారు. జ‌న‌సేన‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని కూడా పాల్ పిలుపునిచ్చారు.త‌మ్ముడు ప్ర‌స్తుతం వారాహి యాత్రల కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు.

 

అయితే ఈ యాత్ర ఆయ‌న కోసం అనుకుంటున్నారా? అలా అనుకుంటే పొరపాటే ఎందుకంటే మోడీని మ‌రోసారి ఢిల్లీలో గ‌ద్దె ఎక్కించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడు అని పాల్ అన్నారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌ని, పోల‌వ‌రం నిర్మించ‌ని, క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ క‌ట్టించ‌ని మోడీకి ప‌వ‌న్ గులాం గిరీ చేస్తున్నాడు. ఆయ‌న‌కు ఓటేయాల‌ని మ‌న‌కు చెబుతున్నాడు. అది వారాహి యాత్ర కాదు.. మోడీ కోసం చేసే యాత్ర. జనసేనకు ఒక్క ఓటేసినా మోడీకి ఓటేసినట్లే. కాబ‌ట్టి త‌మ్ముడు ప‌వ‌న్‌ను న‌మ్మొద్దు అని పాల్ వ్యాఖ్యానించారు.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -