NTR: వైసీపీ కథ ముగియాలంటే ఎన్టీఆర్ చేయాల్సిన పని ఇదే!

NTR: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంది. ఇదే వచ్చే ఎన్నికలకు సూచికగా అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రకటనలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీసీ ఈ ఎన్నిక కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించింది. మరోవైపు టీడీపీ సైతం అదేస్థాయిలో పోరాటం సాగిస్తుంది. కానీ, జనరల్ ఎలక్షన్ నే ప్రధానంగా తీసుకొని ముందుకు నడుస్తున్నారు. ఈ ఈక్రమంలోనే లోకేశ్ పాదయాత్ర సాగుతోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి ప్రత్యేక్షంగా సపోర్టు చేయటానికి వస్తారా అనేదానిపై చర్చ నడుస్తోంది.

 

ఎవరు అవునన్నా కాదన్న.. ఎన్ని గొడవలు జరిగినా, నందమూరి, నారా ఫ్యామిలీలు ఒక్కటే. సమస్య వచ్చినప్పుడు సమీష్టింగా ఎదుర్కొంటారు. సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ కోసం కష్టపడుతారు. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత, రెండు కుటుంబాల్లో అభిప్రాయ భేదాలు వచ్చాయి. కానీ అవన్నీ సర్దుకొనిపోయాయి. అందుకే 2009 లో పార్టీ కోసం ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆ తర్వాత ఆయన అవసరం పార్టీకి రాలేదు. తారక్ కూడా.. సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మరోసారి టీడీపీ గడ్డు పరిస్థితులను ఫేస్ చేస్తోంది.

జూనియర్ మాటలకు, ఆయన యాక్టింగ్ కు కోట్ల మంది ఫ్యాన్సు ఉన్నారు. జూనియర్ ఒక్క పిలుపుతో ఏ పని అయినా చేసేస్తారు. ఇప్పుడు తారక్ ఫ్యాన్సు అవసరం టీడీపీ చాలా అవసరం వచ్చింది. టీడీపీలోకి యువనేత లోకేశ్ వచ్చినప్పటి నుంచి జూనియర్ ఫ్యాన్సు దూరంగా ఉన్నారు. వారంతా ఇప్పుడు పార్టీ కోసం కష్టపడాల్సిన అవసరం వచ్చింది. దీనికి ఎన్టీఆర్ పిలుపు కావాలి. ఒక్కసారి జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన చేస్తే, టీడీపీ భారీ మెజారితో విజయం సాధిస్తుందని, క్లీన్ స్వీప్ కూడా ఏపీలో చేసేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -