Balayya: టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలకృష్ణ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇటీవల వాళ్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా దసరా పండుగ కానుకగా విడుదల కానుంది. ఇకపోతే బాలయ్య బాబుకి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికీ తెలిసిందే.
చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ బాలయ్యను అభిమానిస్తుంటారు. కాగా బాలయ్య బాబుకి కోపం ఆవేశం ఎక్కువ అన్న విషయం తెలిసిందే. గతంలో చాలాసార్లు అభిమానులను తిట్టడం మాత్రమే కాకుండా చేయి కూడా చేసుకున్నాడు. కానీ అభిమానులు దానిని ఏమాత్రం సీరియస్ గా తీసుకోకుండా అది వారిపై చూపిస్తున్న ప్రేమ అభిమానం అని అనుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ నటుడు ఏపీఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణ మురళి బాలకృష్ణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ..
బాలకృష్ణ ఓ ఇద్దరిని తుపాకీతో టపీటపీమని కాల్చాడు. ఎవరైనా మంచివాళ్లు కాలుస్తారా? సైకోలు కాలుస్తారా? మనకు చట్టం, న్యాయం అనేవి ఉన్నాయి. బాలకృష్ణకు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే పోలీస్ స్టేషన్కు వెళ్లొచ్చు. వాళ్ల మీద కేసులు పెట్టవచ్చు.
కానీ చేతిలో గన్ ఉంది కాల్చేశాడు. కాల్చిన తర్వాత ఒక్కరోజైనా జైల్లో ఉన్నాడా? అదే ఒకవేళ నేనిద్దరిని కాల్చితే పోసాని అమాయకుడని వదిలేస్తారా? కొట్టి జైల్లో వేస్తారు. మరి నువ్వు ఇద్దరిని కాల్చావు. నిన్నెవరూ ఏం చేయలేకపోయారు. ఎవరు మానసిక రోగి? ఎవరు క్రూరుడు? అనేది తెలిసిపోతుంది. మీ ఇంట్లో రాత్రి నీ కళ్లముందే వాచ్మెన్ చనిపోయాడు. పొద్దున్నే డెడ్బాడీని దాటుకుంటూ షూటింగ్కు వెళ్లిపోయావు. ఎవరైనా అడిగారా? ఎవరు సైకో అనేది ఇక్కడే అర్థమైపోతుంది. ఇలాంటి ఘటనలు లెక్కలేనన్ని ఉన్నాయి అని చెప్పుకొచ్చాడు పోసానీ మురళీకృష్ణ. కాకా ఇంటర్వ్యూలో భాగంగా పోసాని చేసిన వాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.