Balayya: బాలయ్య అభిమానులను టెన్షన్ పెడుతున్న సెంటిమెంట్ ఇదే!

Balayya: సినిమా ఇండస్ట్రీలో చాలా మందికి సెంటిమెంట్లు అనేవి ఉన్నాయి. సినిమా ప్రారంభించే ముహూర్తం దగ్గర నుండి మూవీ విడుదల సమయం వరకూ అన్నీ ముహూర్తాలను బట్టే చేస్తుంటారు. దర్శకనిర్మాతలకు ఈ ముహూర్తాలు అనేవి చాలా ముఖ్యం. వాళ్లు మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కూడా ఇటువంటి సెంటిమెంట్లను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. బ్లాక్ బస్టర్ డేట్ కు, తమ అభిమాన హీరో సినిమా విడుదల అవుతుందని అంటే చాలా మంది ఆనందపడతారు.

 

గతంలో తమ అభిమాన హీరో సినిమా ప్లాప్ అయిన నెలల్లో ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతోంది అంటే కొందరు భయపడుతుంటారు. దీనిపై సోషల్ మీడియాలో అనేక రకాల చర్చలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటి సెంటిమెంట్లతో కూడి ఓ డిస్కషన్ నెట్టింట జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, నందమూరి హీరో బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ వంటి పెద్ద సినిమాలు ఈ సంక్రాంతికి విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో వారి అభిమానుల మధ్య తరచూ ఏదో ఒక డిస్కషన్ జరుగుతూనే ఉంది.

 

తాజాగా రవితేజ గురించి కూడా ఓ డిస్కషన్ ప్రారంభమైందని చెప్పాలి. అదేంటంటే బాలయ్య, రవితేజల సినిమాలు ఒకే టైంలో రిలీజ్ అయితే బాలయ్య సినిమాలు ప్లాప్ అవుతాయనే టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఇప్పుడు దీని గురించే డిస్కషన్ జరుగుతోంది. రవితేజ ‘కృష్ణ’ సినిమా అలాగే బాలయ్య ‘ఒక్క మగాడు’ ఒకేసారి విడుదలయ్యాయి. ఆ తర్వాత మిత్రుడు, కిక్ సినిమాలు కూడా ఒకేసారి విడుదలయ్యాయి. ఈ రెండు సమయాల్లో బాలకృష్ణ సినిమానే ప్లాప్ అవుతూ వచ్చింది.

 

ఆ రకంగా చూసుకుంటే ఈసారి ‘వాల్తేరు వీరయ్య’లో కూడా రవితేజ నటించాడు కాబట్టి ‘వీరసింహారెడ్డి’ సినిమా ప్లాప్ అవ్వడం ఖాయమంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై అంచనాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. మరి ఇలాంటి టైంలో రవితేజ, బాలయ్య సెంటిమెంట్ నిజమవుతుందో, లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచి ఉండాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -