Bhagavanth Kesari: టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు నందమూరి అభిమానులు. అఖండ, వీర సింహారెడ్డి లాంటి సినిమాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాకుండా ఈ సినిమా ఆ సినిమాలకు మించి సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమా అసలు కథ ఇదే అంటూ ఇప్పటికే అనేక రకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. తాజాగా మరొక ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. మరి ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. కాజల్ అగర్వాల్ పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో ఉంటుందని తెలుస్తోంది.నందమూరి బాలకృష్ణ కాజల్ అగర్వాల్ యుక్త వయసులో ఉన్నప్పుడు వివాహం చేసుకుంటారని, వీరిద్దరి ప్రేమకు గుర్తుగా శ్రీ లీల జన్మిస్తుందని అంటున్నారు. అయితే ఒక ప్రమాదంలో కాజల్ అగర్వాల్ చనిపోతుందని ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ స్వయంగా శ్రీ లీలను పెంచుకుంటాడని అంటున్నారు.
అయితే నిజానికి కాజల్ అగర్వాల్ అలా మద్యంతరంగా చనిపోయే పాత్రలు చేయడం ఇదేమి కొత్త కాదు. గతంలో నేనే రాజు నేనే మంత్రి, ఎవడు వంటి సినిమాల్లో కూడా కాజల్ అగర్వాల్ చనిపోయినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు అదే తరహాలో ఆమె ఈ పాత్ర చేస్తుందని అంటున్నారు. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే మరి. కాగా బాలయ్య బాబు భగవంత్ కేసరి సినిమా అయిన తర్వాత బాలకృష్ణ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాట. ఆ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి.