Tollywood: మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు రామ్ చరణ్. సొంత ట్యాలెంట్తో ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదిగాడు. చిరంజీవి నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 2007లో విడుదలైన చిత్రం ‘చిరుత’. ఈ సినిమాతోనే రామ్ చరణ్ తెరంగేట్రం చేశాడు. ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ సినిమా చేశాడు. ఈ సినిమాతో ఓవర్నైట్లో స్టార్ హీరోగా ఎదిగాడు. మగధీర విజయంతో రామ్ చరణ్ తెలుగు సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో కాజల్కు కూడా మంచి మార్కులు పడ్డాయి. అయితే రాజమౌళి ఈ సినిమాలో హీరోయిన్గా మొదట్లో అనుష్క శెట్టిని అనుకున్నాడట. కానీ ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. దీనికంటూ ప్రత్యేక కారణం కూడా ఉంది.
అదేంటంటే.. మగధీర సినిమాలో హీరోగా రామ్ చరణ్ నటించడమే. మొదట్లో జక్కన్న హీరోయిన్ అనుష్క శెట్టికి సినిమా స్టోరీ చెప్పాడట. అప్పుడు హీరో ఎవరని అడగగా.. రామ్ చరణ్ అని చెప్పడంతో సినిమాను క్యాన్సల్ చేసిందట. రామ్ చరణ్ తనకంటే పొట్టిగా ఉంటాడని అవమానించిందట. అందుకే అనుష్క ‘మగధీర’ సినిమాను ఒప్పుకోలేదట. దీంతో జక్కన్న చేసేదేమీ లేక కాజల్ను సెలెక్ట్ చేశాడు. ఆ తర్వాత సినిమా బాక్సాపీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. సినిమా సూపర్ హిట్ అయింది. అనుష్క సినిమా చూసిన తర్వాత రాజమౌళికి కాల్ చేసి బాధ పడిందట. సినిమా చాలా బాగుందని, అనవసరంగా మంచి ఛాన్స్ ను మిస్ చేసుకున్నానని తెలిపిందట. అప్పుడు జక్కన్న మరో సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారమే.. ప్రభాస్ హీరోగా నటించిన ‘బహుబలి’ సినిమాలో మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో హిట్ అయింది. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్గా అనుష్క మంచి గుర్తింపు పొందింది.