Tollywood: సంగీత గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

Tollywood: సినిమా అంటే మనకు కనిపించే రంగుల ప్రపంచ మాత్రమే కాదు.. మనకు కనిపించని ఎన్నో విషాదాలు దాని వెనక ఉంటాయి. సినిమాల్లో నటించాలనే తపనతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి తాపత్రయ పడే ఎంతోమంది నటులు తమ జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించి వచ్చారనేది చాలామంది నటుల విషయంలో మనం తెలుసుకున్నాం.

అయితే అందరి కథ ఒకేలా ఉండదు అనేది వాస్తవం. ఒక్కొక్కరిది ఒక్కో కథ ఉంటుంది. చాలామంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి నానా కష్టాలు పడుతుంటే, మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీలో మంచి స్థాయిలో ఉండి కూడా కష్టాలు పడుతుంటారు. ఇలాంటి కష్టాలే సినీ నటి సంగీత జీవితంలో కూడా ఉన్నాయి.

కృష్ణవంశీ తీసిన ‘ఖడ్గం’ సినిమాలో ‘ఒకే ఒక్క ఛాన్స్’ అనే డైలాగ్ తో బాగా పాపులర్ అయిన సినీ నటి సంగీత.. తర్వాత కూడా చాలా సినిమాల్లో సందడి చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ లో మహేష్ బాబు చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ లో అదరగొట్టేసింది. ఇక తాజాగా ‘ఆచార్య’ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో సందడి చేసింది.

అయితే సంగీత తన తల్లి విషయంలో ఇబ్బందులకు గురైందని, దీంతో ఆ మధ్యన పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి రావడం తెలిసిందే. సంగీత తన తల్లి ఒకే ఇంట్లో ఉండగా.. సంగీత తన భర్తతో కలిసి పై అంతస్తులో ఉంటే, ఆమె తల్లి, పెద్ద కొడుకుతో కలిసి కింది అంతస్తులో ఉంటే వారట. అయితే తనను ఇల్లు ఖాళీ చేయించాలని తల్లి వేధిస్తోందని సంగీత మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. కాగా ఈ విషయం మీడియాకు లీక్ అవగా.. తన జీవితంలో జరిగిన విషయాల గురించి ఆమె చెప్పుకొచ్చింది.

తన తల్లి తనను డబ్బుల కోసం ఎలాంటి పనులు చేయించేదో సంగీత వివరించింది. తన 13 ఏళ్ల వయసు అప్పటి నుండే డబ్బులు సంపాదించేలా తన తల్లి తనను వాడుకుందని సంగీత తెలిపింది. తన అన్న, తమ్ముడు మత్తుకు బానిసలు అయ్యారని, వాళ్లు ఏమీ సంపాదించరని కానీ వాళ్లను తన తల్లి ఎప్పుడూ వెనకేసుకొస్తుందని సంగీత పేర్కొంది. తల్లి అంటే ఎలా ఉండకూడదో తన తల్లి ద్వారా తాను నేర్చుకున్నానని సంగీత తెలిపింది.

అలాగే తన మీద అక్రమమైన కేసులు పెట్టి పరువు తీయాలని కన్న తల్లే ప్రయత్నించిందని కూడా సంగీత వివరించింది. భర్తతో తాను హ్యాపీగా ఉండటం చూడలేక ఇలాంటి పనులు చేసిందని సంగీత తెలిపింది. చివరకు తన కుటంబంలో కలతలు సృష్టించాలని చూసిందని సంగీత తన తల్లి మీద తీవ్రస్థాయిలో ఆరోపించింది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -