Tollywood: ఈ టాలీవుడ్ హీరోయిన్ల కన్నీటి గాథలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Tollywood: ఎంతో మంది నైపుణ్యం కలిగిన నటీనటులకు, హీరో హీరోయిన్లకు కొదువలేదు. చాలా మంది ఇక్కడ తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసారు. అయితే టాలీవుడ్ లోని చాలా మంది జీవితాల్లో జీవిత భాగస్వామిని కోల్పోయి, నీలినీడలు కమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. అలా జీవిత భాగస్వాములను కోల్పోయి బాధను అనుభవించిన వారెవరో ఇప్పుడు చూద్దాం..

జయసుధ: అక్కినేని నాగేశ్వర రావు మరియు నందమూరి తారకరామారావు గార్లతో చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన జయసుధ, 2017 లోనే భర్త నితిన్ కపూర్ ను పోగొట్టుకున్నారు.

సుమలత: కన్నడతో పాటు తెలుగులో మంచి గుర్తింపును సాధించి, కన్నడ స్టార్ అయిన తన భర్త అంబరీష్ ను సుమలత కోల్పోయింది.

దిల్ రాజ్: టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసర్ గా ఉన్న దిల్ రాజు.. తన భార్య అనితను 2017 లోనే కోల్పోయాడు.

రోహిణి: క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉండే రోహిణి భర్త రఘువరన్.. 2008 లో చనిపోయారు.

సురేఖ వాణి: మంచి మంచి పాత్రలతో అలరించే సురేఖ వాణి.. భర్త సురేష్ తేజ 2019 లో మరణించారు.

సూపర్ స్టార్ కృష్ణ: ఇటీవల స్వర్గస్తులైన సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయనిర్మల 2019లో చనిపోయారు.

మీనా: టాలీవుడ్ ని షేక్ చేసిన మీనా భర్త విద్యాసాగర్ 2022 జూన్ 29న హఠాన్మరణం చెందారు.

డిస్కో శాంతి: అప్పట్లో నటనతో మెప్పించిన డిస్కో శాంతి.. తన భర్త రియల్ స్టార్ శ్రీహరిని కోల్పోయింది. 2013 లో శ్రీహరి మరణించారు.

బోనీ కపూర్: నిర్మాతగా సక్సెస్ అయిన బోనీకపూర్ భార్య అందాల తార శ్రీదేవి 2018 లో కన్నుమూశారు.

ఇలా వివిధ టాలీవుడ్ నటీనటులు వారి జీవితంలో భాగస్వాములను కోల్పోయి గుప్పెడు విషాదంలో మునిగిపోయారు. అయితే వీరిలో కొందరు తిరిగి వివాహం చేసుకున్నా.. మరికొందరు మాత్రం ఒంటరిగానే కాలం గడిపేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జనసేన పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ నేతలు పాటిస్తారా?

Pawan Kalyan:  పవన్ కళ్యాణ్ లో ఇప్పుడు పరిపూర్ణ రాజకీయ నాయకుడు కనిపిస్తున్నాడు. పార్టీకి సంబంధించి అనేకమైన కీలక నిర్ణయాలను చాలా పరిణితితో తీసుకుంటున్నారు. పోలింగ్ రెండు వారాల్లో ఉంది కాబట్టి ఈ...
- Advertisement -
- Advertisement -