Tollywood: ఈ హీరోల సినిమాల డిజాస్టర్ల వెనుక అసలు కథ ఇదే!

Tollywood: ఒక సినిమా తీయడమంటే అంత సులువైన పని కాదు. సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించిన వాళ్ళు కలిసి వస్తే కోట్లకు పడగలెత్తుతారు అలాగే ఏదైనా పొరపాటు జరిగితే అడ్రస్ లేకుండా పోతారు. ఇది ఎప్పటినుంచో నిర్మాతలు ఎదుర్కొంటున్న పరిస్థితి. కానీ కొంతమంది హీరోలు తమ కెరియర్ లో బాగా సంపాదించిన డబ్బును చిత్రాలపై నిర్మాతలుగా పెట్టి భారీగా నష్టపోయారు. సినీ ఫీల్డ్ లో హీరోలుగా వాళ్లకు కలిసి వచ్చినప్పటికీ నిర్మాతలగా బోర్లాపడ్డారు, మరి వాళ్ళు ఎవరో చూద్దాం.

అఖిల్ అక్కినేని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ విడుదలైన అఖిల్ మూవీకి హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరించారు. 50 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 33 కోట్లు వసూలు చేసి ఫ్లాప్ గా నిలిచింది. ఎంతో భారీ అంచనాలతో ఈ సినిమాకి నిర్మాణ బాధ్యతలు వ్యవహరించిన నితిన్ నష్టాన్ని చవిచూశాడు. నాగార్జున నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన అఖిల్ మొదటి చిత్రం కావడంతో ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అవుతుందని అందరూ ఆశించారు. కానీ అనుకోని విధంగా ఈ సినిమా ఓ డిజాస్టర్ గా మిగిలింది.

 

మోహన్ బాబు రీసెంట్ గా తన కొడుకు మంచు విష్ణుతో జిన్నా మూవీని నిర్మించారు. కానీ ఈ మూవీ ఆయనకు భారీ నష్టాన్ని మిగిల్చింది. 20 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రం కేవలం రెండు కోట్లు మాత్రమే వసూలు చేసి పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. అనూహ్యమైన కాన్సెప్ట్ వస్తోందని రిలీజ్ కి ముందు నానా హడావిడి చేశారు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడింది.

 

సూపర్ స్టార్ మహేష్ బాబు తను యాక్ట్ చేసిన బ్రహ్మోత్సవం మూవీకి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆ మూవీ మహేష్ బాబు కెరియర్ లోని అత్యంత డిజాస్టర్ మూవీగా నిలబడటంతో పాటు అతనికి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -