Tollywood Villains: కామెడీతో నవ్విస్తూనే విలనిజంతో భయపడిన టాలీవుడ్ నటులు వీళ్లే?

Tollywood Villains: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటించాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి అయితే మనలో ఎలాంటి నటనకు స్కోప్ ఉందో అలాంటి అవకాశాలు మాత్రమే ఇస్తారు. మనం కమెడియన్ గా చేయగలిగితే కమెడియన్ పాత్రలు లేదా విలన్ గా చేయగలిగితే విలన్ పాత్రలలో నటిస్తూ ఉంటారు.అయితే ఒకేసారి ఇలా రెండు రకాల పాత్రలలో నటించాలంటే ఎంతో నైపుణ్యం ఉండాల్సి ఉంటుంది ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకవైపు తమ కామెడీతో నవ్విస్తూనే మరోవైపు కరుడుగట్టిన విలన్ లా తన విలనిజంతో భయపెట్టే ఎంతోమంది నటులు ఉన్నారు మరి వారు ఎవరో ఓ లుక్కేద్దాం..
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలన్ పాత్రలలోనైనా కమెడియన్ పాత్రలలోనైనా ఇట్టే ఒదిగిపోయే నటుడు కోటా శ్రీనివాసరావు. ఈయన ఒకవైపు కామెడీ పండిస్తూనే మరోవైపు తన విలనిజాన్ని చూపిస్తారో. ముఖ్యంగా ఈయన నటించిన శత్రువు సినిమాలో ఈయన నటన అద్భుతమని చెప్పాలి. ఈ సినిమాలో కోట శ్రీనివాస్ రావు వెంకటరత్నం పాత్రలో ఒకవైపు కామెడీ చేస్తూ మరోవైపు విలన్ గా అందరిని భయపెట్టారు.
ఇక ఈయనతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ కమెడియన్ రావు గోపాలరావు విలన్ గా పేరు సంపాదించుకున్నారు. రావు గోపాలరావు ఈయన కూడా ఎంతో అద్భుతమైన నటుడని చెప్పాలి.ముత్యాలముగ్గు సినిమాలో ఈయన కాంట్రాక్టర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఈయన నటనకు మాత్రం పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమాలో రావు గోపాలరావు గోదారి స్టైల్లో చెప్పిన డైలాగ్స్ అప్పట్లో ఎంతో ఫేమస్ అయ్యాయి ఇలా ఈయన కూడా నటుడిగా కమెడియన్ గా ఒకే సినిమాలో రెండు పాత్రలలో నటించి అందరిని మెప్పించారు.
ఇక తెలుగు సినిమాలలో విలనిజాన్ని కొత్త కోణంలో పరిచయం చేసిన వ్యక్తి పరేష్ రావెల్. క్షణక్షణం సినిమాలో ఈయన నటించిన నాయర్ పాత్ర ఎన్నో దశాబ్దాలు గడిచిన ఇప్పటికి అందరికీ గుర్తుండిపోతుంది. ఇలా ఒక వైపు రావెల్ తన కామెడీతో అందరిని కడుపుబ్బ నవ్విస్తున్నప్పటికీ మరోవైపు విలన్ పాత్రలలో కూడా నటిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే జయప్రకాష్ రెడ్డి సైతం ఒకవైపు హాస్యం పండిస్తూనే మరోవైపు కరుడుగట్టిన విలన్ లా అందరిని భయభ్రాంతులకు గురి చేస్తుంటారు. ఈ విధంగా ఈ నటులందరూ కూడా ఒకేసారి ప్రేక్షకులను సందడి చేస్తూనే మరోవైపు భయపెడుతూ ఉంటారు. ఇలా నటించడంలో వీరు రూటే సపరేట్ అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -