Uttar Pradesh: ఇదేం పోయేకాలంరా బాబు.. 8వ తరగతి విద్యార్థికి లవ్ లెటర్ రాసిన టీచర్?

Uttar Pradesh: ఈ మధ్యకాలంలో చాలా వరకు స్కూల్లో విద్యా బుద్ధులు నేర్పించాల్సిన కొంతమంది గురువులే కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులకు మంచి నడవడికలు నేర్పి మంచి పాఠాలను నేర్పించాల్సిన వారు గాడి తప్పి మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఒక మహిళా టీచర్ చదువుకునే పదవ తరగతి విద్యార్థితో అక్రమ సంబంధం పెట్టుకుని ఇంటి నుంచి పారిపోయిన విషయం తెలిసిందే. అలాగే చదువుకుంటున్న విద్యార్థులపై టీచర్లే అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి. అయితే తాజాగా ఒక టీచర్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థికీ ప్రేమలేఖ రాసింది.

 

పూర్తి వివరాల్లోకి వెళితే..తాజాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది.ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రాథమిక పాఠశాలలో ఓ వ్యక్తి ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇదే పాఠశాలలో ఓ బాలిక 8వ తరగతి చదువుకుంటుంది. కాగా అదే బాలికపై ఆ ఉపాధ్యాయుడు ఎప్పటి నుంచో కన్నేశాడు. ఆ బాలిక వైపు ఒక రకంగా చూడడం, అనవసరంగా మాట్లాడడం చేస్తుండేవాడు. ఇక ఇంతటితో ఆగని ఈ గురువు ఇటీవల ఆ బాలికకు ప్రేమిస్తున్నానంటూ లవ్ లెటర్ కూడా రాసిచ్చాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, సెలవుల్లో నిన్ను బాగా మిస్ అవుతున్న, స్కూల్ కు తొందరగా రా.

 

మన ఇద్దరం పక్క పక్కనే కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకుందాం అంటూ ఆ ఉపాధ్యాయుడు ప్రేమలేఖ రాశాడు. అయితే అదే విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. కోపంతో ఊగిపోయిన ఆ బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కీచక టీచర్ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -