Vangaveeti Radha: ఏపీలో గత కొద్ది రోజులుగా వంగవీటి రాధా టీడీపీలో నుంచి వైసీపీలోకి మారబోతున్నారు అనే ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతున్న విషయం తెలిసిందే.. ఈ వార్త ఏపీలో హట్ టాపిక్ గా కూడా మారింది. తాజాగా ఈ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ స్టాప్ పెట్టారు. తాను టీడీపీ వీడటం లేదని రాధా స్పష్టం చేశారు. అంతేకాకుండా వైసీపీ నేతలే టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఇంటికి ఇటీవలే రాధా వెళ్లారు.
ఆయనతో పాటు ఇంకొందరు వైసీపీ నేతలను టీడీపీ లోకి ఆహ్వానించినట్టు తెలిసింది. వంగవీటి రాధా టీడీపీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. చాలా కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడంతో ఆయన టీడీపీతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారనే టాక్ వచ్చింది. ఆయన వైసీపీలోకి వస్తున్నారనీ కొందరు వైసీపీ నేతలూ కామెంట్ చేశారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం లేదా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని వైసీపీ
యోచిస్తున్నట్టూ వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల ఆయన కాశీకి వెళ్లినప్పుడూ ఆయన వెంట కొడాలి నాని కనిపించడం కూడా ఈ వదంతులకు బలాన్ని ఇచ్చాయి. కానీ, అదంతా వట్టి ప్రచారమేనని వంగవీటి రాధా తెలిపారు. తాను టీడీపీలోనే ఉంటున్నట్టు స్పష్టత ఇచ్చారు. అంతేకాకుండా ఎప్పటికీ వైసీపీలో జాయిన్ అవ్వను అని తెలిపారు. దీంతో వైసిపికి షాక్ తగిలినట్టు అయింది. మరి వంగవీటి రాధా పిలుపు మేరకు వైసీపీలోని వారు టీడీపీ లోకీ వస్తారేమో చూడాలి మరి.