Varisu: వారసుడు డేట్ ఛేంజ్.. సంతోషంలో చిరు, బాలయ్య ఫ్యాన్స్!

Varisu: సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలున్న సినిమాలు పోటీ పడుతున్నాయి. అయితే వారసుడు సినిమాకు ఎక్కువ థియేటర్లు పడటం వల్ల బాలయ్య, మెగాస్టార్ అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో వారికి ఓ శుభవార్త అందిందని చెప్పొచ్చు. ఈ సంక్రాంతికి బాలయ్య వీరసింహారెడ్డి, మెగాస్టార్ వాల్తీరు వీరయ్య సినిమాలు విడుదల కానున్నాయి.

 

అయితే ఈ సినిమాలకు పోటీగా వారుసుడు సినిమా రానుంది. తమిళ నటుడు విజయ్ నటించిన వారసుడు సినిమాను నిర్మాత దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. అందుకే ఆయన పరిధిలో ఉన్న అన్ని థియేటర్లలో వారసుడు సినిమాను విడుదల చేయనున్నాడు. ఇకపోతే ఇప్పుడు ఆ సినిమా గురించి ఓ షాకింగ్ వార్త బయటపడింది.

 

ఇన్ సైడ్ టాక్ ప్రకారంగా చూస్తే పలు సాంకేతిక కారణాల వల్ల వారసుడు తెలుగు వెర్షన్ వాయిదా పడేలా ఉందని సమాచారం. అనుకున్న డేట్ కన్నా మూడు రోజులు ఆలస్యంగా జనవరి 14వ తేదిన వారసుడు సినిమా విడుదల కావొచ్చని తెలుస్తోంది. అయితే తమిళనాడులో మాత్రం యథావిధిగా 11వ తేదినే ఈ సినిమా విడుదల కానుంది. ఇకపోతే అజిత్ నటించిన తెగింపు సినిమా విడుదలలో మాత్రం ఏ మార్పు ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాల గురించే సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

 

ఈ రోజు కూడా వారసుడు సినిమాకు సంబంధించి ఓ పేపర్ యాడ్ వచ్చింది. అందులో కూడా వారసుడు కమింగ్ థిస్ సంక్రాంతి అని ఇచ్చారు గానీ ఏ తేదిన విడుదల అవుతుందో చెప్పలేదు. అయితే తెగింపు సినిమా నిర్మాతలు మాత్రం స్పష్టంగా సినిమా విడుదల తేదీని తెలిపారు. ఒకవేళ ఇదే నిజమైన పక్షంలో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలకు మొదటి రోజు థియేటర్ల విషయంలో పెద్ద టెన్షన్ ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే దిల్ రాజు ఎక్కువ స్క్రీన్లను లాక్ చేయడం వల్ల ఫస్ట్ డే వసూళ్లకు గండం పడుతోందని అందరూ అనుకుంటున్నారు. అలా ఆందోళన చెందుతున్న ఫ్యాన్స్ కు ఇది పెద్ద రిలీఫ్ ఇస్తుందని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -