Vastu Tips: ఈ వాస్తు చిట్కాలను పాటిస్తే ఇంట్లో సంపద, శ్రేయస్సు పెరుగుతుందట.. ఏం చేయాలంటే?

Vastu Tips:  ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు విషయాలను వాస్తు శాస్త్రాలను నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చాలామంది వాస్తు చిట్కాలను పాటించి ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలను తొలగించుకుంటున్నారు. కాగా వాస్తు చిట్కాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అంటున్నారు పండితులు. వాస్తు ప్రకారం సంపద, శ్రేయస్సు పెరగాలంటే వీటిని కచ్చితంగా పాటించాలి. ఈ వాస్తు నియమాలను కనుక పాటించిన‌ట్లయితే సంపద పెరుగుతుంది.

మరి ఆ చిట్కాలు ఏంటో ఆ నియమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉత్తర దిశ సంపద, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. ఈ దిశ కుబేరుడిని ఆహ్వానిస్తుంది. ఆర్థిక పత్రాలు, విలువైన వస్తువులని ఈ దిశలో పెట్టడం వలన సంపద వస్తుంది. తూర్పుదిక్కుకి అభిముఖంగా పని చేసినట్లయితే ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కవచ్చు. ఆర్థిక బాధలని తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఈశాన్య మూలలో వాటర్ ఫౌంటెన్ ని కానీ, చేపల తొట్టెని కానీ పెట్టాలి. వీటిని పెట్టడం వలన ఆర్థిక బాధల నుండి గట్టెక్కవచ్చు. పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. సంపదని ఇవి ఆకర్షిస్తాయి. ఇంటి ప్రధాన ద్వారం ఉత్తరం లేదా ఈశాన్యం వైపు ఉండేటట్టు చూసుకోవాలి.

ఇంటికి మంచి శక్తిని, అదృష్టాన్ని తీసుకురావాలంటే కిటికీలని లోపలికి తెరవాలి. సంపదని ఇవి ఇంటికి తీసుకువస్తాయి. ఇల్లు ఎప్పుడూ కూడా మురికిగా ఉండకూడదు. ఇల్లు మురికిగా వున్నా, శుభ్రంగా లేకపోయినా ప్రతికూల శక్తి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీని అస్సలు ఇల్లు ఆకర్షించలేదు. సంపద ఉండదు. నెగటివ్ ఎనర్జీ మాత్రమే ఇంట్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఇల్లు శుభ్రంగా ఉండాలి. కాబట్టి కచ్చితంగా ఇంటిని శుభ్రం చేసుకునే విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ చేయకండి. డబ్బులకి సంబంధించిన వాటిని, లాకర్ వంటి వాటిని ఈశాన్యం వైపు పెట్టుకోవాలి. సంపద రెట్టింపు అవుతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -