Venu Swamy: సంతానం గురించి బోల్డ్ కామెంట్ చేసిన వేణు స్వామి!

Venu Swamy: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వేణు స్వామి గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇతడిని వేణు స్వామి కంటే.. వివాదాల స్వామి అని అనవచ్చు. ఎందుకంటే నిత్యం ఏదో ఒక వివాదాన్ని తట్టి లేపుతాడు. సెలబ్రేటీలకు జాతకాలు చెబుతూ.. సోషల్ మీడియాలో హైలెట్ అవుతూ ఉంటాడు.

ఇలా సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా.. వేణు స్వామి హైలెట్ అవుతూనే ఉంటాడు. కొంతమంది యాక్టర్ల గురించి నెగిటివ్ గా చెప్పుకుంటూ.. మరి కొంతమంది యాక్టర్ ల గురించి పాజిటివ్ జాతకాలు చెబుతూ ఉంటాడు. కొంతమంది హీరోల గురించి నెగిటివ్ గా చెప్పినప్పుడు.. తమ అభిమానులు వేణు స్వామిని ఒక రేంజ్ లో ఏకిపారేస్తారు. ఇలా తరచూ వేణు స్వామి ఏదో ఒక వివాదాన్ని సృష్టిస్తూ.. తెలుగు రాష్ట్రాల్లో హడావిడి చేస్తున్నాడు.

ఇటీవల ఐదే క్రమంలో వేణు స్వామి.. రష్మిక గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా స్టార్ గా హడావిడి చేస్తున్న రష్మిక మందన్న త్వరలో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతుందని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియా లో హడావిడిగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా వేణు స్వామి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు బయటపెట్టాడు.

అవేమిటంటే.. సంతానం లేనివారు కామాఖ్య గుడి దగ్గరికి వెళ్లి అక్కడ కొండపైనా ఒక రూమ్ తీసుకుని దంపతులిద్దరూ ఫిజికల్ గా కలవాలి అట. అలా కలిసిన వెంటనే కామాఖ్య గుడికి వెళ్లి దర్శించుకుంటే.. ఆ దంపతులకు ఒక సంవత్సరంలో సంతానం కలుగుతుందని వేణు స్వామి బోల్డ్ గా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అంతేకాకుండా ఈ విషయాన్ని బల్ల గుద్ది చెప్పినట్లుగా మాట్లాడారు. ప్రస్తుతం వేణు స్వామి బోల్డ్ గా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ హడావిడి చేస్తున్నాయి. మరి మీరు కూడా ఆ వీడియో వైపు ఒక లుక్ వెయ్యండి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -