Vijay Devarakonda: అభిమానులకు విజయ్ దేవరకొండ కోటి విరాళం.. ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే?

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. విజయ్ ప్రస్తుతం నియమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ఖుషి. ఇందులో సమంత హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని అందుకుంది. ఈ సినిమా విడుదల రోజు డివైడ్‌ టాక్‌ వచ్చినా తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో భారీగా కలెక్షన్స్‌ వైపు దూసుకుపోతుంది.

కాగా ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సక్సెస్ లో భాగంగా విజయ్ దేవరకొండ తన అభిమానులకు కోటి రూపాయల సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. దాంతో పలువురు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మూడు రోజుల్లోనే రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ఖుషి మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ చేరుకున్నాడు విజయ్‌. తన సక్సెస్‌లో అభిమానులను కూడా భాగం చేయడానికి తన రెమ్యూనిరేషన్ నుంచి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 100 కుటుంబాలకు గాను మొత్తం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు విజయ్ దేవరకొండ అక్కడ ప్రకటించారు..

దీంతో ఆయన అభిమానులు సర్‌ప్రైజ్‌ అయ్యారు. పదిరోజుల్లొ 100 కుటుంబాలను సెలెక్ట్ చేసి ఒక్కో ఫ్యామిలీకి లక్ష రూపాయల చొప్పున తానే స్వయంగా అందిస్తానని విజయ్ అన్నారు. నా సక్సెస్‌లో, నా హ్యాపీనెస్‌లో మీరు భాగం పంచుకోవాలి. నా సంపాదనను మీతో షేర్ చేసుకోలేకపోతే అంతా వేస్ట్. మీరంతా నా ఫ్యామిలీనే.. దేవర ఫ్యామిలీ, స్ప్రెడింగ్ ఖుషి అని సోషల్ మీడియాలో ఒక అప్లికేషన్ ఫార్మ్ పెడతాను ఇది ఎలా చెయ్యాలో తెలియదు కానీ, అవసరం ఉన్నవాళ్లకి ఏ హెల్ప్ చేసినా నాకు సంతోషమే. మీరు ఉంటున్న ఇంటి రెంట్‌, పిల్లల స్కూల్‌ ఫీజులు ఇలా కొంతైనా నా సాయం ఉండాలనుకుంటున్నాను. నా సోషల్ మీడియా ఖాతా ద్వారా వివరాలు తెలుపుతా.. ఆర్థికసాయం కావాల్సిన వారు అభిమానులతో పాటు ఎవరైనా దరఖాస్తు చేసుకోండి.. వాటిలో 100 ఫ్యామిలీలను ఎంపిక చేసుకొని సరిగ్గా పదిరోజుల్లో ఈ మొత్తాన్ని అందజేస్తాను. అప్పుడే నాకు ఖుషి సక్సెస్ సంపూర్తి అవుతుంది అని విజయ్ దేవరకొండ తెలిపారు. విజయ్ దేవరకొండ చేసిన పనికి అభిమానులు కామెంట్లు వర్షం కురిపించడంతోపాటు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: చిరు జీవులకు సైతం అన్యాయం చేసిన జగన్ సర్కార్.. మరీ ఇంతలా మోసమా?

CM Jagan: జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున దోపిడీలు చేస్తున్నారు వైకాపా నేతలు కొండలను గుట్టలను చెరువులను వదలలేదు పెద్ద...
- Advertisement -
- Advertisement -