Anasuya: గత కొంతకాలంగా హీరో విజయ్ దేవరకొండ, యాంకర్ అనసూయ భరద్వాజల మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా అనసూయను లక్ష్యంగా చేసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, కామెంట్లు, దూషణలతో విరుచుకుపడడం, అనసూయ కూడా కావాలనే విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్స్ చేయడం ఇలా కొంతకాలంగా వార్ నడుస్తూనే ఉంది. మొన్నటికి మొన్న విజయ నటిస్తున్న కృషి సినిమా పోస్టర్ పై విజయ్ దేవరకొండ పేరు ముందు ద అని ఉండడంతో దాన్ని పైత్యంగా అభివర్ణించింది అనసూయ.
ఆ సంగతి పక్కన పెడితే తాజాగా మొట్టమొదటిసారి అనసూయ విజయ్ దేవరకొండ వివాదం పై స్పందిస్తూ ఒక వీడియోని విడుదల చేసింది. ఆ వీడియోలో అనసూయ మాట్లాడుతూ… విజయ్, నేను లోగడ స్నేహితులమే. అప్పుడు ఏ సమస్య లేదు. అర్జున్ రెడ్డి విడుదల అయిన తర్వాతే పరిస్థితి మారింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ బూతులను మ్యూట్ చేశారు. విజయ్ ఒక థియేటర్ ను సందర్శించినప్పుడు వాటిని ఆన్ స్క్రీన్ పై వేశారు. వాటిని పలకాలని విజయ్ దేవరకొండ అభిమానులను కోరాడు. వారు ఆ బూతు పదాలను మాట్లాడారు. విజయ్ ఆ సినిమాలో ధూషించే పాత్రను పోషించాడు. సినిమా వరకు బాగానే ఉంది.
కానీ, నిజ జీవితంలో ప్రేక్షకులను ఆ పదాలు పలికేలా ప్రోత్సహించడం ఏంటి? ఒక తల్లిగా ఇలాంటి అసభ్యకర పదాలు నన్ను బాధిస్తాయి. నేను దీనిపై విజయ్ తో మాట్లాడాను. నిజజీవితంలో వాటిని ప్రోత్సహించొద్దని కోరాను అని అనసూయ చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ తండ్రి 2019లో మీకు మాత్రమే చెప్తా సినిమాని నిర్మిస్తున్న సమయంలో తనకు పాత్రను ఆఫర్ చేసినట్టు అనసూయ తెలిపింది. విజయ్ ప్రచారకర్త తనను దర్భాషలాడుతూ పోస్టులు పెట్టినట్టు అతడి బృందానికే చెందిన ఒకరు నాకు చెప్పారు. ప్రచారకర్త పెయిడ్ ట్రోల్స్ చేస్తున్నప్పుడు దానిపై విజయ్ కు అవగాహన ఉంటుంది కదా? అతడికి తెలియకుండా వారు ఇలాంటివి చేయరని నేను ఖచ్చితంగా చెప్పగలను అంటూ యాంకర్ అనసూయ ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఇక మీదట అయినా వీరిద్దరి మధ్య వివాదం చల్లబడుతుందేమో చూడాలి మరి.