Villain: సౌత్ సినిమాలపై విలన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

Villain: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు చేయాలి అన్నా లేదంటే ఆడియో ఫంక్షన్లలో రిలీజ్ ఫంక్షన్లను ఏదైనా మాట్లాడాలి అన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎందుకంటే మాట్లాడినప్పుడు చిన్న మిస్టేక్ మాట్లాడినా కూడా నెటిజన్స్ దానిని భూతద్దంలో చూస్తూ పెద్దది చేస్తూ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా సదరు సెలబ్రిటీలపై దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో చాలావరకు సెలబ్రిటీలు ఆలోచించి మాట్లాడుతున్నారు. తాజాగా కూడా ఒక నటుడు చేసిన వాఖ్యలపై కొందరు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే… నటుడు రాహుల్ దేవ్ గురించి మనందరికీ తెలిసిందే.

తెలుగులో సింహాద్రి మాస్,ఆంధ్రావాలా, నాయక్, ఎవడు లాంటి ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాహుల్ దేవ్. ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ వెబ్ సిరీస్ లలో నటిస్తూ దూసుకుపోతున్నారు రాహుల్ దేవ్. కాగా ఢిల్లీకి చెందిన రాహుల్ దేవ్ మొదట బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత టాలీవుడ్ లో కూడా అవకాశాలను అందుకుంటూ చాలా సినిమాలలో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా రాహుల్ దేవ్ నటించిన గ్యాస్ లైట్ అనే సస్పెన్స్ త్రిల్లర్ సినిమా హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

 

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ దేవ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల పై సంచలన వ్యాఖ్యలు చేయగా అవి కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా రాహుల్ దేవ్ మాట్లాడుతూ.. సౌత్ సినిమాలు ఇటీవల బాగా ఆడుతున్నాయి. కానీ అవన్నీ కూడా 1970 – 80 సినిమాల కథలే. అప్పటి సినిమా కథలే ఇప్పటికి తీస్తున్నారు. అవే ఫాలో అవుతున్నారు. అప్పటి కథలనే మళ్ళీ మళ్ళీ మార్చి చెప్తున్నారు. ఇక సౌత్ సినిమాల్లో కొన్ని యాక్షన్, ఫైట్ సీక్వెన్స్ లో మరీ ఓవర్ గా ఉంటాయి కానీ వాళ్ళు చెప్పే కథ పాతదే అయినా చెప్పే విధానం కొత్తగా ట్రై చేస్తున్నారు. దానివల్లే ప్రేక్షకులను మెప్పించగలుగుతున్నారు. కాబట్టి కథని చెప్పిన విధానం, దాన్ని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ముఖ్యం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు రాహుల్ దేవ్. రాహుల్ చేసిన వాఖ్యలపై టాలీవుడ్ ప్రేక్షకులు మండిపడడంతో పాటు దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YSRCP Manifesto: జగన్ మేనిఫెస్టోపై జనాభిప్రాయం ఇదే.. బాబోయ్ జగన్ అంటున్న ఏపీ ప్రజలు!

YSRCP Manifesto: శనివారం రోజు మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ ముందు వైసీపీ మేనిఫెస్టో...
- Advertisement -
- Advertisement -