Vishnupriya: అన్నీ వదిలేసి ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ.. ఏమైందంటే?

Vishnupriya: ఈ మధ్య కాలంలో యాంకర్ విష్ణుప్రియ సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. బుల్లితెరపై ఆమె అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. సినిమాల్లోని ఐటెం సాంగ్స్ లో కూడా నటిస్తోంది. అయితే ఆమె గతంలో యువ హీరో సంతోష్ శోభన్ తో కలిసి వెబ్ సిరీస్ లలో నటించింది. కానీ వాటితో అన్నకున్నంత గుర్తింపు మాత్రం రాలేదు. ఎప్పుడైతే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆమెకు క్రేజ్ చాలా పెరిగిపోయింది. బుల్లితెరపై సుడిగాలి సుధీర్ తో చేసిన షో పెద్ద హిట్ అయింది. ఈ షో ద్వారానే ఆమె చాలా పాపులర్ అయింది.

 

సుధీర్ తో కలిసి చేసిన ‘పోవే పోరా’ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత మల్లెమాల వారు నిర్వహించిన కొన్ని ఈవెంట్లలో బాగానే మెరిసింది. కానీ ఆ షో మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నుంచి ఆమె బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు. కానీ సినిమాల్లో మాత్రం బాగానే ఛాన్సులు వస్తున్నాయి. కవర్, ఐటెం సాంగ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తుంది ఈ భామ్మ.

 

ఫొటోలు వైరల్‌..
అయితే ఈ మధ్య కాలంలో ఆమె విదేశాలకు ఎక్కువగా వెళ్తోంది. ఫారిన్ లొకేషన్స్ లో దిగిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అక్కడ దిగిన హాట్ ఫోటోలను, ఫారిన్ అందాలను సామజిక మాధ్యమాల్లో ఆరబోస్తుంది.ఇప్పుడు తాజాగా ఆమె మలేషియాకు వెళ్లిపోయింది.ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌ స్టాలో పోస్టు చేసింది.

 

అయితే మలేషియాకు విష్ణుప్రియ ఓ జబర్దస్త్ కమెడియన్ తో కలిసి వెళ్లింది. ఆమె ఎవరో కాదు రీతు చౌదరి, వీరు ఇరువురు కలిసే ఇప్పుడు ఈ ఫారిన్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి న్యూ ఇయర్‌ పార్టీకి వెళ్లారా.. లేదంటే ఏదైనా ట్రిప్‌ ప్లాన్‌ చేసుకున్నారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -