Live Accident Video: గత వారంలో ఒడిశాలో ఘోరమైన రైలు ప్రమాద ఘటన జరిగిన విషయం మనకు తెలిసిందే. లూప్ లైన్ లో ఆగి ఉన్నటువంటి గూడ్స్ ను కోరమండల్ ఎక్స్ప్రెస్ ఢీకొనడంతో దాదాపు 300 మంది మరణించిన సంగతి మనకు తెలిసిందే. కొన్ని వేల మంది ప్రయాణికులు తీవ్రంగా గాయాలు పాలయ్యారు. ఈ విధంగా కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదకర ఘటన అందరినీ ఎంతగానో కలిచి వేసిందని చెప్పాలి.
ఇకపోతే తాజాగా ఈ ప్రమాద ఘటనకు కొన్ని క్షణాల ముందు ఏం జరిగిందనే విషయానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో భాగంగా ఏసీ కోచ్ లో ప్రయాణిస్తున్నటువంటి ఓ ప్రయాణికుడు ట్రైన్ లో కొన్ని దృశ్యాలను వీడియోగా చిత్రీకరించారు. ఇందులో భాగంగా అక్కడ స్వీపర్ రైలు మొత్తం క్లీన్ చేస్తూ ఉండగా మరికొందరు నిద్రపోతున్నారు.
A purported video from inside the #CoromandelExpress just seconds before the deadly train #crash at Bahanaga in #Balasore, #Odisha has gone viral.
People in the coach can be heard screaming for their lives before the video ends abruptly. #CoromandelExpressAccident pic.twitter.com/Q7XPgHKznJ— Chaudhary Parvez (@ChaudharyParvez) June 8, 2023
ఇలా ఆ యువకుడు వీడియో తీస్తూ ఉండగానే ఒక్కసారిగా రైలులో కుదుపులు రావడంతో ఫోన్ కింద పడిపోయింది. దీంతో అక్కడ చిత్రాలు సరిగా కనిపించకపోయిన పెద్ద ఎత్తున ప్రయాణికులు కేకలు వేస్తూ, గట్టిగా అరుస్తూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుందో అనే విషయం కూడా తెలియకుండా ఈ వీడియో ఉందని చెప్పాలి.
అయితే ప్రమాదం జరగడంతో పెద్ద ఎత్తున ప్రయాణికులు భయంతో కేకలు వేస్తున్నట్లు మాత్రం అర్థమవుతుంది. కానీ ఈ వీడియో కోరమండల్ ఎక్స్ప్రెస్ కి సంబంధించినది చెప్పే ఆధారాలు ఎక్కడా లేవు. అయితే ఈ కోరమండల్ రైలు ప్రమాద ఘటన మాత్రం ఎంతోమంది జీవితాలలో కుటుంబాలలోను తీవ్ర విషాదాన్ని నింపిందని చెప్పాలి.