Odisha Train Accident: తాజాగా కోరమాండల్ రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ ఘటన సోషల్ మీడియాలో హట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ ఘటనపై ప్రతి ఒక్కరు ద్రిగ్భాంత్రి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాదం ప్రమాదంలో ఇప్పటివరకు 278 మందికి పైగా మృతి చెందారు. వందల మంది గాయపడ్డారు. తప్పు ఎవరిదీ అయినా వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తాజాగా రైల్వే శాఖ ఈ ఘటనపై స్పందిస్తూ సిగ్నల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించింది.
కమిటీ నివేదిక వచ్చాక ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుస్తాయని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాద ఘటనలో 900 మంది గాయాల పాలైనట్లు సమాచారం. అయితే దశాబ్ద కాలంలో అత్యంత భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చిన రైలు ప్రమాదం ఇదే కావడం గమనార్హం. ఈ ప్రమాదం గురించి ప్రతిపక్ష పార్టీల నేతలు స్పందిస్తూ సిగ్నలింగ్ వ్యవస్థ ఫెయిల్యూర్ కావడం వల్లే ప్రమాదం జరిగిందంటే నమ్మలేకపోతున్నామని అన్నారు. అయితే ఈ మార్గంలో కవచ్ వ్యవస్థను ఎందుకు ఏర్పాటు చేయలేదనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
కవచ్ వ్యవస్థ ఉంటే పట్టాలు బాగా లేకపోయినా ఇతర సాంకేతిక సమస్యలు ఉన్నా ఆటోమేటిక్ గా బ్రేకులు పడే అవకాశం ఉంటుంది. దేశంలోని కొన్ని ప్రధాన మార్గాల్లో ఈ వ్యవస్థ అందుబాటులో ఉంది. ఒడిశా రైలు ప్రమాదంలో ఎన్నో హృదయ విదారక ఘటనలు చోటు చేసుకున్నాయి. తల్లి చనిపోవడంతో 14 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చిన రమేష్ అనే వ్యక్తి తిరుగు ప్రయాణంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ఎక్కి ప్రాణాలు కోల్పోయారు.