Veera Simha Reddy: సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వీరసింహరెడ్డి భారీ కలెక్షన్లలతో దూసుకుపోతుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, అందాల తార శ్రుతీ హాసన్ జంటగా నటించిన ఈ సినిమా.. బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ గా నిలిచింది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన వీరనరసింహా రెడ్డి సినిమాలో కొన్ని ఆసక్తికర సన్ని వేశాలు కట్ చేశారట. దాదాపు ఎనిమిది సీన్లు చిత్రం నుంచి తొలగించినట్లు సమాచారం. అయితే ఏ సీన్లు తొలగించారు, వాటిని తొలగించడానికి కారణాలేంటో తెలుసా..!
*సినిమాలో వరలక్ష్మీ, నవీన్ చంద్ర మధ్య సాగిన రొమాంటిక్ సీన్ ను కట్ చేసినట్లు తెలుస్తోంది.
*బాలయ్య బాబు, శృతి హాసన్ పెళ్లి సీన్ ను సైతం తొలగించినట్లు సమాచారం.
*బాలకృష్ణ సినిమాలో సాధారణంగా కనిపించే సుమోలు గాల్లోకి ఎగిరే సీన్ ఈ సినిమాలో కూడా తీశారట. కానీ అనివార్య కారణాలతో సుమోలు గాలిలో ఎగిరే సీన్ కట్ చేశారు.
*పోలీస్ స్టేషన్ లో బాలయ్య ఫైట్ చేసే సీన్ తో పాటు కెమికల్ ఫ్యాక్టరీని బాలయ్య ఓపెనింగ్ చేసే సన్నివేశాన్ని తొలగించినట్లు సమాచారం.
* హిరో బాలకృష్ణ, హనీరోజ్ మధ్య సాగిన రొమాంటిక్ సీన్స్ ను చిత్రబృందం తొలగించినట్లు తెలుస్తోంది.
* ఈ చిత్రంలో బాలయ్య బాబుకు చెల్లెలి పాత్రలో నటించిన వరలక్ష్మి రాఖీ కట్టే సీన్ ముందుగా చిత్రీకరించారట. కానీ ఆ సన్నివేశాన్ని సైతం కట్ చేసినట్లు సమాచారం.
*తండ్రి గురించి చిన్న బాలయ్య పాత్రకు ముందే తెలిసినా తెలియనట్టు నటించే సీన్ ను కూడా తొలగించారని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
బాలయ్య సనిమాలో ఇన్ని సీన్లు కట్ చేశారని తెలియడంతో ఆయన అభిమానులు చిత్రబృందంపై కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సీన్ల వల్ల సినిమా నిడివి పెరుగుతుందనే ఉద్దేశంతోనే వీటిని తొలగించినట్లు సమాచారం.