Samantha: వామ్మో.. సమంత డబ్బు కోసం ఇలాంటి పనులు చేస్తుందా?

Samantha: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఇండస్ట్రీలో కొనసాగడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. కొన్నిసార్లు వారికి నచ్చని విధంగా కూడా నటిస్తూ ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని స్టార్ట్ సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఉంటారు అయితే ఒకసారి ఇండస్ట్రీలో స్టార్ డమ్ వచ్చింది అంటే వారి చుట్టూ ఎన్నో బ్రాండ్లు తమ కంపెనీలను ప్రమోట్ చేయాలి అంటూ తిరుగుతూ ఉంటారు.ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటారు.

ఇలా సెలబ్రిటీలు ప్రమోట్ చేసే వస్తువులను వారు ఉపయోగిస్తున్నట్లు బిల్డప్ ఇచ్చినప్పటికీ ఆ వస్తువులను వారు ఏమాత్రం ఉపయోగించరు. ఇలా ఒక్క బ్రాండ్ ను ప్రమోట్ చేయడం ద్వారా లక్షల్లో కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కేవలం రెమ్యూనరేషన్ కోసమే మన
ఆరోగ్యానికి హానికరం అని తెలిసినప్పటికీ కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు.ఇలా ఇది వరకే పలువురు ఇలాంటి ప్రమాదకరమైన ఉత్పత్తులను ప్రమోట్ చేయడం ద్వారా భారీగా నేటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది.

 

ఈ క్రమంలోనే ప్రస్తుతం సమంత కూడా ఈ విధమైనటువంటి నేటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంత ఒకవైపు తెలుగు సినిమాలతో పాటు మరోవైపు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ సందడి చేస్తున్నారు.ఒక్కో సినిమాకు దాదాపు 5 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకునే సమంత భారీ స్థాయిలో పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

 

తాజాగా ఈమె పెప్సీ కూల్ డ్రింక్ ప్రమోట్ చేస్తూ ఒక వీడియోని చేశారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు నెటిజెన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ సమంతను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నీకు డబ్బుకేం లోటు సమంత…బాగానే సంపాదించావుగా మరి డబ్బు కోసం కకృతి పడి ఇలాంటి చెత్త బ్రాండ్లు అన్నింటిని ప్రమోట్ చేయడం అవసరమా, ఇది ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా ఇలాంటి వాటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.కేవలం డబ్బు కోసమే ఇలా చేస్తున్నారంటూ భారీ స్థాయిలో సమంతపై ట్రోల్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -