Ragi Patralu: టెక్నాలజీ పూర్తిగా డెవలప్ అవ్వడంతో ప్రజల ఆహారపు వాటిలో జీవనశైలిలో పూర్తిగా మార్పు వచ్చేసింది. అయితే ఇదివరకటి రోజుల్లో మన పెద్దలు ఎక్కువగా మట్టి కుండలు రాగి పాత్రలు మాత్రమే వంటల కోసం ఉపయోగించేవారు. కానీ టెక్నాలజీ మారిపోవడంతో ఎక్కువగా స్టీలు, ప్లాస్టిక్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. స్టీల్ ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యాలు దెబ్బ తింటున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలావరకు రెస్టారెంట్లలో అలాగే ఇంట్లో చాలామంది రాగి పాత్రలను ఉపయోగిస్తున్నారు.
మరి రాగి పాత్రలో నీరు తాగడం, తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రాగి పాత్రలోని నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎఫెక్టివ్ గా పనిచేసి వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అలాగే జీర్ణవాహికలో పెరిస్టాల్టిక్ మోమెంట్ ను మెరుగుపరుస్తుంది. రాగి ఫాస్పోలిపిడ్స్ కలిగి ఉండటం వల్ల ఇది బ్రెయిన్ డెవలప్ మెంట్, బ్రెయిన్ ప్రొటక్షన్ కు సహాయ పడుతుంది. బ్రెయిన్ లో నాడీవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది బ్రెయిన్ ను షార్ప్ గా ఉంచుతుంది. రాగి కప్పులోని నీరు త్రాగడం వల్ల మెదడు చురుకుగా క్లియర్ గా పనిచేస్తుంది.రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల బాడీ సిస్టమ్ ను శుభ్రం చేస్తుంది.
శరీరంలోని టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇది బరువు తగ్గడానికి అల్సర్ నివారికు సహాయపడుతుంది. రాగి పాత్రలోని నీరు తాగడం వల్ల యాంటీ యాక్సిడెంట్స్ వ్యాధినిరోధకతను పెంచడంలో బాగా సహాయపడుతుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. దాంతో హైపోథైరాయిడిజంకు చాలా ఉపయోగకరం. అలాగే ఇది బాడీ ఫ్యాట్ ను కరిగిస్తుంది. కాబట్టి, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ప్రతి రోజూ ఉదయం ఖచ్చితంగా రాగి కప్పులోని నీరు తాగడం మంచిది.