Posani Krishna: చంద్రబాబు, అశ్వనీదత్ పై పోసాని ఘాటు కామెంట్స్.. ఏమైందంటే?

Posani Krishna: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డుల వేడుకలు ఎంతో ఘనంగా జరిగేవి. సినిమా రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేక 24 రంగాలలో రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డులను అందించేది. అయితే రాష్ట్రం విడిపోయాక అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు నంది అవార్డుల గురించి పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఈ విషయమై ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఉద్దేశిస్తూ ఉత్తమ గుండా, ఉత్తమ అవార్డులు ఇవ్వాలి అంటూ అశ్విని దత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ఘాటుగా స్పందించాడు. ఈ క్రమంలో పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ..” ఉత్తమ వెన్నుపోటు దారుడు ఉత్తమ వెధవ, ఉత్తమ మోసగాడు అంటూ మీకే బిరుదులు ఇవ్వాలి. చంద్రబాబు భజన చేస్తూ ఇలా జగన్ ని విమర్శించటం తప్పని పోసాని తెలిపారు.

 

జగన్ ఎవరికైనా వెన్నుపోటు పొడిచే అన్యాయం చేసినట్లు నిరూపిస్తే నీ కాళ్లు పట్టుకుంటాను అని పోసాని కృష్ణ మురళి చురకలు అంటించారు. ఎన్టీఆర్ ని మోసం చేసి పార్టీ లాక్కోవడమే కాకుండా ఆయన్ని చెప్పులతో కొట్టించి అవమానించినప్పుడు ఏం చేస్తున్నావు అంటూ పోసాని ప్రశ్నించాడు. ఇక ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకల కోసం సూపర్ స్టార్ రజినీకాంత్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు.

 

ఈ విషయం గురించి కూడా పోసాని మాట్లాడుతూ.. రజినీకాంత్ ప్రతిరోజు విజయవాడకి వచ్చి చంద్రబాబుని పొగిడినా కూడా జగన్ కి ఎటువంటి అభ్యంతరం లేదని, తమకు మెగాస్టార్ చిరంజీవి మాత్రమేనని తెలిపాడు. చిరంజీవి అంటే జగన్ కి అమితమైన అభిమానం ఉందని, చిరంజీవికి కూడా జగన్ అంటే ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఇలా అశ్వినీ దత్ గురించి పోసాని చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -