Shriya Saran: శ్రియ విదేశీ వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి అసలు కారణమిదా?

Shriya Saran: టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రియ సరన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రియ సరన్ ప్రస్తుతం అడపాదడపా సినిమాలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. అప్పట్లో టాలీవుడ్ టాప్ హీరోలు అయిన బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, తరుణ్ లాంటి హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.

కాగా గత ఏడాది విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాలో చిన్న పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అలాగే చివరగా తెలుగులో బాలకృష్ణ హీరోగా నటించిన పైసా వసూల్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే శ్రియ తాజాగా నటించిన చిత్రం మ్యూజిక్ స్కూల్. ఈ సినిమా త్వరలోనే తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు భర్త పిల్లల బాధ్యత చూసుకుంటూ బిజీ బిజీగా గడుపుతోంది ఈ ముద్దుగుమ్మ. కాగా శ్రియ రష్యన్ వ్యక్తి అయినా ఆండ్రి ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2018 లో ఈ జంట పెళ్లి అతికొద్ది మంది సన్నిహితులు బంధువుల సమక్షంలో జరిగింది.

లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అదే విషయాన్ని చాలా ఆలస్యంగా అభిమానులతో పంచుకుంది శ్రియ. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో శ్రియ కి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త తెగ చక్కర్లు కొడుతోంది. ఒక స్టార్ హీరోతో దాదాపుగా 5 సంవత్సరాల పాటు శ్రియ ముంబైలో సహజీవనం చేసింది అంటూ ఒక వార్త ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు హీరో రానా దగ్గుపాటి. వీరిద్దరూ ముంబైలో దాదాపు ఐదేళ్లపాటు సహజీవనం చేశారట. ఆ సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒక్కటి అవుతారు అని అందరూ భావించారు. కానీ శ్రియ అందుకు భిన్నంగా రష్యన్ వ్యక్తి అయిన ఆండ్రి అనే బిజినెస్ మ్యాన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం సినిమాలలో నటిస్తూనే మరోవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ బిజీబిజీగా గడుపుతోంది.

Related Articles

ట్రేండింగ్

YSRCP Leaders Tension: టీడీపీ జనసేన కూటమి మేనిఫెస్టో విషయంలో వైసీపీ భయాలివేనా.. ఆ టెన్షన్ తగ్గట్లేదా?

YSRCP Leaders Tension:తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత జగన్ పార్టీలో భయం మొదలైనట్లుగా ఉంది. ఎందుకంటే వైసీపీ మేనిఫెస్టోలో ఉన్నా హామీల కన్నా కూటమి ఇచ్చిన హామీలు చాలా చాలా...
- Advertisement -
- Advertisement -