BRO Movie: బ్రో మూవీకి నో చెప్పిన ఆ ఇద్దరు అదృష్టవంతులు ఎవరంటే?

BRO Movie: మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన సినిమా బ్రో రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. ఇందులో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, బ్రహ్మానందం, సుబ్బరాజు తదితరులు నటించారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించాడు. ఇక నటుడు సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభట్ల ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే.

వినోదయ సీతం సినిమాని తెలుగులోకి రీమేక్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కన్నా ముందు వేరే వాళ్ళని అనుకున్నాడట సముద్రఖని. ఇంతకీ వాళ్ళు ఎవరంటే పవన్ కళ్యాణ్ స్థానంలో ప్రభాస్, సాయి ధరంతేజ్ ప్లేస్ లో అఖిల్ ని అనుకున్నాడట. అయితే ప్రభాస్ కథ వినక ముందే ఈ సినిమాని రిజెక్ట్ చేసేసాడట.

 

ఆ తర్వాత కథ పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే ఆయన కొన్ని మార్పులు సూచించి కథని ఓకే చేశాడట. కానీ అఖిల్ ప్లేస్ లో సాయిధరమ్ తేజ్ అయితే బాగుంటుంది అని సూచించడంతో సాయి ధరమ్ తేజ్ ని కథలోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందంతో పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా ఒప్పుకొని ఉంటే ప్రభాస్ ఖాతాలో మరొక ఫ్లాప్ పడి ఉండేది.

 

సినిమాని రిజెక్ట్ చేసి మంచి పని చేశాడు అంటూ తెగ ఆనంద పడుతున్నారు. బ్రో సినిమా ఒరిజినల్ సినిమా కన్నా బడ్జెట్ బాగా ఎక్కువ కానీ ఒరిజినల్ సినిమాలో ఉన్నంత ఫీలింగ్ ఈ సినిమాలో కనిపించడం లేదు అంటున్నారు ప్రేక్షకులు. ఈ సినిమా కేవలం పవన్ ఫ్యాన్స్ కి మాత్రమే అంటూ పెదవి విరుస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -