Ranga Reddy: ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే. భార్యాభర్తల గొడవలంటే అంతగా ఉండదు. గంటనో రెండు గంటల్లోనే మళ్లీ ఒకటవుతారు. కానీ.. కొందరు భార్య భర్తలు గొడవడి వారు తీసుకుంటున్న నిర్ణయాలతో కుటుంబం మొత్తం ఇబ్బందులకు గురవుతోంది. దంపతుల గొడవల కారణంగా కొందరు హత్యలు చేస్తుండగా.. మరికొందరు ఆత్మహత్యలు లేదంటే ఇళ్లను విడిచి పారిపోతున్నారు. భార్యభర్తలు గొడవపడటంతో ఓ మహిళ ఇల్లు వదిలివెళ్లిపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్పేట్ మండల పరిధిలోని కుంట్లూరు గ్రామానికి చెందిన తిరుందాస్ ప్రసాద్, పూజా భార్యాభర్తలు. వీరికి 6 సంవత్సరాల క్రితం పెళ్లి జరిగింది. తిరుందాస్ ప్రసాద్ స్థానికంగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పెళ్లి అయిన కొన్ని ఏళ్లకు వారికి ఇద్దరు సంతానం కలిగారు. ఆ ఇద్దరు పిల్లలతో భార్య భర్తలు సుఖసంతోషాలతో గడుపుతున్నారు. అలా కొనేళ్లు వారి జీవితం హాయిగా గడుస్తూ వచ్చింది.
ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా ఆనందంగా సాగిన వీరి కాపురంలో ఒక్కసారిగా కలహాలు మొదలయ్యాయ. దీంతో గత కొన్ని రోజుల నుంచి ఇద్దరు తరచూ గొడవల పడేవారు. ఒక్కరోజు మౌనంగా ఉన్నారంటే ఆ తర్వాత రోజుల తరబడి గొడవలు చేసుకునేవారు. ఈక్రమంలో మరోసారి పెద్దగా గొడవ జరగడంతో మనస్తాపం చెందిన పూజా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ‘నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నానని, నా కోసం వెతకొద్దు’. ఒకవేళ నాకోసం వెతికితే మాత్రం పిల్లలతో సహా నేను కూడా చస్తానని భర్తకు మెసెజ్ చేసి పిల్లలను తీసుకుని అదృశ్యమైంది. బంధువులు, తెలిసిన వారి ఇళ్లలో భర్త వెతికినా భార్య ఆచూకీ లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో తన భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. పిల్లలను తీసుకుని వెళ్లిపోయిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది.