Sai Pallavi: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శర్వానంద్ మహానుభావుడు, శతమానం భవతి, రన్ రాజా రన్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రాధా, మహాసముద్రం, శ్రీకారం, జాను, పడి పడి లేచే మనసు ఇలా ఎన్నో సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఇటీవల శర్వానంద్ ఒకే ఒక జీవితం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా కంటే ముందు ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా విడుదల అయింది. అయితే ఆ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం శర్వానంద్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ షూటింగ్ ని ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. కాగా పీపుల్ మీడియా బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇది శర్వానంద్ 35వ సినిమా అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయానికి వస్తే..
ఇప్పటివరకు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఎవరు అన్నది వెల్లడించ లేదు. కానీ తాజాగా అందిన సమాచారం ప్రకారం, సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తనకున్న పరిచయంతో స్వయంగా శర్వానంద్, సాయిపల్లవి కోసం ప్రయత్నిస్తున్నాడట. మరి సాయి పల్లవి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అన్నది చూడాలి మరి.