Unstoppable Season 2: బాలయ్య-పవన్ కళ్యాణ్‌ మధ్య అలాంటి బంధముందా?

Unstoppable Season 2: నందమూరి బాలకృష్ట హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’. ఈ షో మొదటి సీజన్ పూర్తి చేసుకుని రెండో సీజన్‌లో కూడా అడుగుపెట్టింది. సీజన్-2లో రెండు ఎపిసోడ్స్ కూడా విజయవంతంగా ముగించింది. మొదటి ఎపిసోడ్‌కి ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, అతడి కుమారుడు నారా లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఊహించని ముఖ్య అతిథులతో ఈ ఎపిసోడ్ మంచి రెస్పాన్స్ అందుకుంది. రెండో ఎపిసోడ్‌కు యంగ్ హీరోలు సిద్ధు జొన్నల గడ్డ, విశ్వక్‌ సేన్‌తో పాటు ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ కూడా వచ్చారు. ఈ ముగ్గురితో బాలయ్య బాబు చేసిన చిట్ చాట్ అదిరిపోయింది. ఫన్నీ డైలాగ్స్, సీక్రెట్స్, సినీ ఇండస్ట్రీలో వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న ప్రాబ్లమ్ ఇలా అన్ని రకాల సమస్యలతో బాలయ్య యంగ్ హీరోలను ప్రశ్నించారు.

ఈ ఎపిసోడ్ కూడా అభిమానులు, ప్రేక్షకులకు తెలియని ఎన్నో విషయాలు తెలిశాయి. హీరోల స్ట్రగుల్స్ అర్థమయ్యాయి. దీనికి సంబంధించిన బైట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ ఎపిసోడ్‌లో ఒక ముఖ్యమైన సన్నివేశం నెలకొంది. ఈ చిట్‌చాట్‌లో బాలయ్య బాబు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఉన్న సాన్నిహిత్యం గురించి చెప్పుకొచ్చారు. దీన్ని చూసిన ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు. పవన్ కళ్యాణ్‌తో బాలయ్యకు ఇంత మంచి సాన్నిహిత్యం ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు. బాలయ్య డైరెక్టర్ నాగవంశీతో మాట్లాడుతూ.. ‘భీమ్లా నాయక్ సినిమాలో మొదటగా హీరోగా అనుకున్నది ఎవరినీ? అని ప్రశ్నించగా..

దానికి వంశీ సమాధానం చెప్తూ.. ‘మీరే సార్’ అని అన్నారు. అప్పుడు బాలయ్య బాబు ‘మరి చివరికి ఏమైంది?’ అని ప్రశ్నించారు. అప్పుడు నాగవంశీ మాట్లాడుతూ.. ‘మేము మొదట్లో ఈ సినిమా స్టోరీ మీకే చెప్పాం సార్. మీరు చేస్తే బాగుంటుందని కూడా చెప్పాం. అప్పుడు మీరే నాకంటే పవన్ కళ్యాణ్‌కు బాగా సెట్ అవుతుందని చెప్పారు.’ అని సమాధానం చెప్పారు. ఈ విషయం చెప్పడంతో షోలో పాల్గొన్న ప్రేక్షకులు ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. కాగా అన్‌స్టాపబుల్ సీజన్-2 చివరి ఎపిసోడ్‌లో పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై షో యాజమాన్యం త్వరలో క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -