Pawan Kalyan: తెలుగు సినిమా కీర్తి పతాకం అంతర్జాతీయ వేదిక మీద రెపరెపలాడింది. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికే కలెక్షన్ల సునామీని క్రియేట్ చేయగా.. ఇప్పుడు అంతర్జాతీయ అవార్డుల వేటలో మునిగిపోయింది. ఈ సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ లో ఉందనే వార్త ఇప్పుడు అందరికీ ఆసక్తిని రేపుతోంది. అయితే అంతకన్నా ముందు ఈ సినిమా మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది.
ఆస్కార్ అవార్డులకు ఎంట్రీగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డును ఈ సినిమా సొంతం చేసుకుంది. ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటకు గాను ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ వచ్చింది. అయితే ఈ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ టీం ఎంతో గౌరవపూర్వకంగా అందుకోగా.. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ గురించి అంతా చర్చ మొదలైంది.
తెలుగు తెర మీద అన్ని రంగాల్లో రికార్డులు క్రియేట్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్లు దర్శక ధీరుడు రాజమౌళి ప్రకటించాడు. దీంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సీక్వెల్ ఎప్పుడు అనే క్లారిటీ లేకపోయినా.. తాజాగా ఈ సీక్వెల్ కు సంబంధించిన అంచనాలను మరింత పెంచేలా, టాలీవుడ్ అంతా ఊపిరిబిగబట్టి చూసేలా ఓ ఆసక్తికర అప్ డేట్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
దర్శక ధీరుడు రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ కు సంబంధించిన లీడ్ దొరికిందని ప్రకటించగా.. త్వరలోనే ఈ సినిమా కథ రెడీ అవుతుందని తెలుస్తోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనిపిస్తారనే వార్త అందరిలో ఆసక్తిని పెంచుతోంది. అయితే పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ చేస్తారని.. స్క్రీన్ మీద కాసేపు కనిపించి ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తారనే వార్త ఇండస్ట్రీలో చర్చకు దారితీసింది.