Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి యాత్రలో భాగంగా ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందని అందుకు కారణం వాలంటీర్లు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రాష్ట్రంలో మహిళలు కనిపించకుండా పోతున్నారు అందుకు కారణం వాలంటీర్లు ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే ఉమెన్ ట్రాఫిక్ అంటే చిన్న విషయం కాదు ఈ విషయంపై కేంద్ర నిఘా వర్గాలు కూడా పనిచేస్తున్నాయి.
కేంద్రంలోని పెద్దలు, నిఘా వర్గాలు అంటూ మాట్లాడితే తన మాటలకు బరువు పెరుగుతుందనేంత మూర్ఖత్వం పవన్ కల్యాణ్ ఉందా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది ఉమెన్ ట్రాకింగ్ గణాంకాలు కూడా కేంద్ర ప్రభుత్వం బయటపడుతూ ఉంటుంది అలాంటిది పవన్ కళ్యాణ్ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్త పెద్ద వివాదంగా మారింది.
ఒకవేళ ఈ విషయం గురించి పవన్ కళ్యాణ్ కేంద్రం నిఘవర్గాలు ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పగలరా… ఎలాంటి ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్. ఇలాంటి తప్పుడు వ్యాఖ్యల ద్వారా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగుతూ సక్సెస్ సాధించగలరా అన్న సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదో నోటికి వచ్చినట్టు మాట్లాడితే తాను ఒక రాజకీయ సెలబ్రిటీ అయిపోతానని పవన్ ఆలోచించి ఉండవచ్చు.
ఇక మనం ఏదైనా ఒక మాట మాట్లాడుతున్నాము అంటే అందుకు తగ్గ ఆధారాలను తీసుకొని మాట్లాడాలని అప్పుడే నిజా నిజాలు బయటికి వస్తాయని పలువురు తెలియజేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఎలాంటి ఆధారాలు లేకుండా దేశవ్యాప్తంగా ఉమెన్ ట్రాఫికింగ్ కేసులలో చివరిలో ఉన్నటువంటి ఏపీ ఫై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నిరాధారణమైన వ్యాఖ్యల ద్వారా పవన్ వార్తల్లో నిలవచ్చు కానీ రాజకీయాలలో మాత్రం సక్సెస్ కాలేరంటూ మరికొందరు పవన్ వ్యాఖ్యలపై వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.