Ram Gopal Varma: టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మనందరికీ తెలిసిందే. తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ. అంతేకాకుండా సమాజంలో జరిగే విషయాలపై రాజకీయ విషయాలపై సినిమాల విషయాలపై తనదైన రీతిలో స్పందిస్తూ లేనిపోని కాంట్రవర్సీలను కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఇది ఇలా ఉంటే గతంలో రాంగోపాల్ వర్మ చాలామంది బయోపిక్ లను తెరకెక్కించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే సినిమాను తెరకెక్కించబోతున్నారు. వ్యూహం సినిమా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ నేపథ్యంలో రూపొందుతోంది. ఇందులో రాంగోపాల్ వర్మ జగన్ పాత్రను హైలెట్ చేసి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో జగన్ పాత్రలో ఫేమ్ అజ్మల్, జగన్ సతీమణి భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించనున్నారు. ఆ పాత్రల్లో వారు ఎలా కనిపించనున్నారో తెలుపుతూ కొన్ని ఫోటోలను విడుదల చేశారు. జగన్, భారతి పాత్రలకు ఆ ఇద్దరు సరిగ్గా సరిపోయారు అనిపిస్తోంది.
ముఖ్యంగా కొన్ని ఫోటోలలో మానసలో భారతి పోలికలు కనిపిస్తున్నాయి. కాగా గతంలో ఆర్జీవీ రూపొందించిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు చిత్రంలోనూ జగన్ పాత్రలో అజ్మల్ నటించడం విశేషం. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకం పై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. ఇది అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం ఇతివృత్తంతో రూపొందుతోందని, త్వరలో ఇతర వివరాలను ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది అన్నది తెలియాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే మరి.