Teja Sajja: పవర్ స్టార్ కు సైతం సాధ్యం కాని రికార్డ్ తేజ సజ్జా ఖాతాలో చేరనుందా?

Teja Sajja: టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పవన్ చేతిలో ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అవన్నీ కూడా షూటింగ్ దశలోనే ఉన్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో ఫుల్ బిజీ బిజీగా మారిపోయారు. ఇక సినిమాల పరంగా రెండున్నర దశాబ్దాల కెరీర్ లో ఎన్నో రికార్డులను సృష్టించాడు పవన్. అయితే ఒక ఫీట్ మాత్రం పవర్ స్టార్ కి అందని ద్రాక్షలా మారింది. అదే రూ.100 కోట్ల షేర్ క్లబ్. పవన్ కళ్యాణ్ తోటి స్టార్స్ అందరూ ఇప్పటికే వంద కోట్ల షేర్ క్లబ్ లో చేరారు.

 

అయితే పవన్ ఇప్పటిదాకా ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయకపోవడం, రాజకీయాలతో బిజీగా ఉండి ఇటీవల ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తుండటంతో ఆయన స్థాయికి తగ్గ వసూళ్లు రావడం లేదు. పవర్ స్టార్ కెరీర్ లో ఇప్పటిదాకా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా భీమ్లా నాయక్ ఉంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.98 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఆ సమయంలో ఏపీ లో సినిమా టికెట్ ధరలు చాలా తక్కువగా ఉండటం భీమ్లా నాయక్ వసూళ్లపై ప్రభావం చూపించింది. లేదంటే ఆ సినిమా ఈజీగా రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరేది. అయితే ఇప్పుడు ఈ వంద కోట్ల ఫీట్ ని పవన్ కంటే ముందుగా ఒక కుర్ర హీరో సాధిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఆ యంగ్ హీరో మరెవరో కాదు తేజా సజ్జా. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే.. సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ ను సాధించి ప్రస్తుతం మరిన్ని రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ వారం రోజుల్లోనే రూ.75 కోట్ల షేర్ తో సత్తా చాటింది. వీకెండ్, వీక్ డేస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. దీంతో ఈ సినిమా త్వరలోనే రూ.100 కోట్ల షేర్ క్లబ్ లో చేరడం ఖాయమైంది. అలాగే గ్రాస్ పరంగా రూ.200 కోట్లకు పైగా రాబడుతుంది అనడంలో సందేహం లేదు. ఇంతవరకు పవన్ కల్యాణే రూ.100 కోట్ల షేర్, రూ.200 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరలేదు. అలాంటిది ఆయన కంటే ముందు ఒక కుర్ర హీరో ఈ ఫీట్ సాధించనుండటం నిజంగా విశేషమనే చెప్పవచ్చు.

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -