Agent: ఏజెంట్ మూవీ ఫ్లాపైతే ఆ నిర్మాత కెరీర్ నాశనమవుతుందా?

Agent: అఖిల్ అక్కినేని హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఏజెంట్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఈనెల 28వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది.ఇప్పటివరకు అఖిల్ నాలుగు సినిమాలలో నటించగా అందులో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈయన నటించిన మిగతా సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటించిన ఏజెంట్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా 28వ తేదీ విడుదలవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు.

ఇక ఈ చిత్రానికి అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ సినిమా గురించి కొన్ని విషయాలను తెలియజేశారు. ఇక ఈ సినిమా గురించి అనిల్ సుంకర మాట్లాడుతూ.. అఖిల్ ఎంతో అద్భుతంగా నటించారని ఒకరోజు ఈ సినిమాలో ఎమోషనల్ సన్ని వేశాలలో నటించే సమయంలో అఖిల్ ను చూడగానే ఆయన ఓ పెద్ద స్టార్ అవుతారని నమ్మకం తనకి ఏర్పడిందని తెలిపారు.ఇక ఈ సినిమా లెక్కల గురించి నిర్మాత మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.

ఈ సినిమా ప్రారంభం ముందే సుమారు 45 కోట్ల బడ్జెట్ అవుతుందని అనుకున్నాము అయితే కరోనా కారణం వల్ల ఈ సినిమా వాయిదా పడటంతో వడ్డీలు కూడా బాగా పెరిగాయని బడ్జెట్ అనుకున్న దానికన్నా రెండింతలు ఎక్కువ అయిందని తెలిపారు.ఇక ఈ సినిమాకు డైరెక్టర్ హీరో ఫుల్ రెమ్యూనరేషన్ కనుక తీసుకుంటే 100 కోట్ల బడ్జెట్ సినిమా అవుతుందని ఈయన తెలియచేశారు. ఇలా అనిల్ సుంకర చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒకటి కూడా సరైన హిట్ లేనటువంటి అఖిల్ కోసం 100 కోట్ల బడ్జెట్ కేటాయించడం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇక ఈ సినిమా హిట్ అయితే కనుక నిర్మాత బతికి బయటపడతారని లేకపోతే భారీ స్థాయిలో నిర్మాతలు నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం అఖిల్ సైతం ఎంతో కష్టపడ్డారు. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ట్రైలర్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసాయి. మరి అఖిల్ ఏజెంట్ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారు… ఈ సినిమా ద్వారా నిర్మాతలు లాభాలను అందుకుంటారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -