Bhola Producer: ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా రిలీజ్ చేసిన భోళా నిర్మాత.. మెగాస్టార్ డబ్బులు వెనక్కిస్తారా?

Bhola Producer: మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరోయిన్ తమన్నా కలిసి నటించిన చిత్రం భోళా శంకర్. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది. కాగా ఈ సినిమాను కొన్ని ఏరియాలు మినహా మిగతా ఏరియాలలో నిర్మాత సొంతంగా రిలీజ్ చేశారు. చిరంజీవి ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ కు ముందు 65 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారని సమాచారం. ఈ మూవీ కోసం నిర్మాత అనిల్ సుంకర హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి చిరంజీవికి రెమ్యునరేషన్ ఇచ్చారట.

ఏజెంట్ సినిమాతో అప్పుల్లో కూరుకుపోయిన అనిల్ సుంకర భోళా శంకర్ సినిమా ఫ్లాప్ రిజల్ట్ తో కోలుకోలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
భోళా శంకర్ సినిమా శాటిలైట్ హక్కులు సైతం అమ్ముడవలేదని సమాచారం. కొన్ని ఏరియాల నుంచి విడుదలకు ముందు మంచి ఆఫర్లు వచ్చినా చిరంజీవి రేంజ్ కు తగిన ఆఫర్లు కాదని నో చెప్పారట. గతంలో వరంగల్ శ్రీను భారీ సినిమాల హక్కులు కొని నష్టపోగా ప్రస్తుతం అనిల్ సుంకర అవే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చిరంజీవి తన పారితోషికంలో కొంత మొత్తం వెనక్కు ఇస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

 

మరి మెగాస్టార్ చిరంజీవి ఈ విషయం పట్ల ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి. అభిమానులతో పాటు నెటిజన్స్ కూడా చిరంజీవి తన పారితోషికాన్ని పూర్తిగా వెనక్కి ఇస్తే నిర్మాత బాగుంటారని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అభిమానులు ఈ సినిమా పట్ల తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరు ఖాతాలో ఈ భోళా శంకర్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడుతుందని అందరూ భావించారు. కానీ ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది..

 

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -