Shaakuntalam: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత శాకుంతలం అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమాను ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సమంత తన ఆరోగ్యం బాగోలేకపోయినా ఈ సినిమా కోసం ప్రమోషన్స్ చేయడానికి ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో దుశ్యంతుడు-శకుంతల మధ్య జరిగిన సన్నివేశాలను క్లియర్ గా జనాలకు అర్థమయ్యే విధంగా డైరెక్టర్ చూపించినట్లు తెలుస్తోంది.
శాకుంతలం సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంతుడు పాత్రలో నటించారు. అలాగే ఈ మూవీలో భరతుడి పాత్రలో అల్లు అర్హ కనిపించనుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హా చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో మొదటగా అల్లు అర్హ క్యారెక్టర్ కి మరో స్టార్ హీరో కొడుకును అనుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆ వార్త గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు షికారు చేస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కొడుకుని ఈ రోల్ లో చూపించడానికి తారక్ ని డైరెక్టర్ గుణశేఖఱ్ అప్రోచ్ అయ్యారని, అయితే కొడుకును అప్పుడే ఇండస్ట్రీలో అడుగు అడుగుపెట్టడం ఇష్టం లేని ఎన్టీఆర్ ఆ ఆఫర్ ను తిరష్కరించినట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఎన్టీఆర్ ఒప్పుకొని ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ పాత్రలో ముందు ఎన్టీఆర్ కొడుకుని సెట్ చేసేవారని తెలుస్తోంది. తారక్ ఒప్పుకోకపోవడంతోనే ఆ పాత్ర అర్హాకు వెళ్లిందని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. శాకుంతలం సినిమా ట్రైలర్ ఆధారంగా చూస్తే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అభిమానులు అనుకుంటున్నారు.