Karnataka Election: వామ్మో.. కర్ణాటక ఎన్నికల్లో గాలి జనార్ధన్ రెడ్డికి అంత మెజర్టీ వచ్చిందా?

Karnataka Election: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తాజాగా కర్ణాటక ఎన్నికల్లో 2 వేలకు పైగా ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించిన విషయం తెలిసింది. ఆయ‌న భార్య గాలి ల‌క్ష్మి అరుణ మాత్రం బ‌ళ్లారి నుంచి ఓటమి పాలయ్యారు. బీజేపీను వీడి కల్యాణ రాజ్య ప్రగతి పక్ష అని ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేసుకుని దాదాపు నలభై ఐదు స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపారు. గాలి జ‌నార్ధ‌న్ రెడ్డి పార్టీ వ‌ల్ల బీజేపీకి పెద్ద మొత్తంలో ఓట్లు న‌ష్ట‌పోయాయి.

దాదాపు 15 స్ధానాల్లో గాలి పార్టీ బీజేపీ ఓట్లు చీల్చి కాంగ్రెస్ కు లాభం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒక్క గంగావతిలో తప్ప మిగతా 14 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే ఆధిక్యంలో ఉంది. మరొకవైపు ఒక‌ప్ప‌టి గాలి అనుచ‌రుడు బీజేపీ ముఖ్య నేత‌, మాజీ మంత్రి శ్రీరాములు ఈ సారి బ‌ళ్లారి రూర‌ల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మ‌రోవైపు రామ‌న‌గ‌ర నుంచి పోటీ చేసిన కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార గౌడ కూడా ఓటమి పాలయ్యారు. కాగా సిద్దరామయ్యను సీఎం చేస్తే తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తానని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేసిన విష‌యం తెలిసిందే. కాగా గాలి జనార్దన్ రెడ్డి కర్ణాటక ఎన్నికల్లో 2 వేలకు పైగా ఓట్లతో భారీ మెజారిటీతో విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -