Lokesh: వామ్మో.. జగన్ పై లోకేశ్ సెటైర్లు మామూలుగా లేవుగా!

Lokesh: టీడీపీ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్రను విజయవంతంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే ఏపీలోని పలు జిల్లాలను సందర్శించారు. ఇది ఇలా ఉంటే ఈ యువగళం పాదయాత్రలో భాగంగా తాజాగా నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. కరోనా కంటే జగన్ వైస్ చాలా ప్రమాదకరమం. ఈ జగన్ వైరస్ అన్ని వ్యవస్థల్ని నాశనం చేసింది అని తెలిపారు. ఈ వైర‌స్ నిర్మూల‌న‌కు చంద్ర‌బాబు వ్యాక్సిన్ స‌రైన ఔష‌ధ‌మ‌ని అన్నారు. అన్ని వ‌ర్గాల‌ వ్యాపారస్తులు కూడా జగనోరా వైరస్ బాధితులేనని, జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ చంద్రబాబేనని చెప్పారు.

యువగళం పాదయాత్ర 147వ రోజు ఉమ్మ‌డి నెల్లూరులోని కోవూరు నియోజకవర్గంలో కొనసాగించారు. సాలుచింతల విడిది కేంద్రం వద్ద వ్యాపారులతో నారా లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. స్టౌవ్‌బీడీ కాలనీ, పడుగుపాడు, కోవూరు బజారు, మండబైలు, గుమ్మలదిబ్బ, పాతూరు, దామర మడుగు, ఆర్‌ఆర్‌.నగర్‌, కాగులపాడు, రేబాల కూడలి మీదుగా పాదయాత్ర కొనసాగింది. వ్యాపారస్తులు తమ సమస్యలను లోకేష్‌కు విన్నవించారు. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే చూశామని, త్వరలో వ్యాపారస్తులు బిజినెస్ హాలిడే ప్రకటించే ప్రమాదం కూడా ఉందని నారా లోకేష్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు అలాగే జగన్ సొంత పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తా బండిలో గంజాయి పెట్టి వేధించారని నారా లోకేష్ ఆరోపించారు.

 

పన్నులు, విద్యుత్ ఛార్జీలు, పెంచి వ్యాపారస్తులను, రైస్ మిల్లర్లను జగన్ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. జ‌గ‌న్‌ ప్రభుత్వం పెంచేసిన పన్నులు, విద్యుత్ చార్జీలను టీడీపీ అధికారంలోకి రాగానే తగ్గిస్తామని నారా లోకేష్‌ మాట ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకునేందుకు అయ్యే ఖర్చులు, పెట్రోల్, డీజిల్ పై పన్నులు ఇలా ప్రతి ఒక్కటింని తగ్గిస్తామని ప్రకటించారు. అలాగే బియ్యం ఎగుమతులు కోసం కేంద్రం వసూలు చేస్తున్న పన్నులను, చిరు వ్యాపారస్తులు జీఎస్టీ రిటర్న్స్ చెల్లింపుల్లో నిబంధనలను సడలించేలా టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారని లోకేష్ తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు, వ్యాపారస్తులకు సాయం అందిస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేస్తామని ప్రకటించారు లోకేష్..

Related Articles

ట్రేండింగ్

YS Sharmila: జాబు రావాలంటే జగన్ పోవాలి.. వైరల్ అవుతున్న షర్మిల సంచలన వ్యాఖ్యలు!

YS Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల నవ సందేహాలు పేరిట వైయస్ జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగా లేఖ రాశారు ఈ లేఖ ద్వారా గత ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన...
- Advertisement -
- Advertisement -