YCP: హిందూపురం నియోజకవర్గంలోని అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీకి భారీ షాక్ తగిలిందని చెప్పాలి. గత ఎన్నికలలో భాగంగా హిందూపురం నియోజకవర్గం లో టిడిపి పార్టీ జెండా ఎగరవేసిన సంగతి తెలిసిందే. ఇలా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా హిందూపురం నియోజకవర్గం ఉందని చెప్పాలి అయితే తాజాగా బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి ఏకంగా 300 కుటుంబాలు చేరాయి దీంతో వైసిపికి మరోసారి షాక్ తగిలింది.
వైఎస్సార్సీపీ కౌన్సిలర్ టీడీపీలో చేరారు. పేరుకే పదవులు.. ఐదేళ్లుగా ఒక్క అభివృద్ధి పని చేయలేదు.. మూడేళ్లుగా కౌన్సిలర్గా వార్డు సమస్యలపై ప్రశ్నిస్తున్నా పట్టించుకునేవాళ్లు లేరన్నారు కౌన్సిలర్ పరుశురాం. తాను గత మూడు సంవత్సరాలుగా కౌన్సిలర్ గా ఉన్నప్పటికీ తన పట్ల ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా లేవని అలాంటి మర్యాద లేని పార్టీలో ఉండటం కంటే విడిపోవడమే మంచిదికొనీ తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని తెలిపారు.
ఇలా ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో పార్టీ కండువా కప్పుకొని ఈయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు . కౌన్సిలర్ పరశురాం మాత్రమే కాకుండా వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉన్న నింకంపల్లి, రహమత్పురం, ముక్కడిపేట ప్రాంతాలకు చెందిన మూడు వందల ముస్లిం కుటుంబాలు వైఎస్సార్సీపీని వీడి బాలకృష్ణ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంఐఎం పార్టీ తరుపున కౌన్సిలర్గా పోటీ చేసిఓడిపోయిన అభ్యర్థి కూడా టీడీపీలో చేరారు. ఇలా ఒకేసారి భారీ స్థాయిలో వైసిపి నుంచి టిడిపికి మారడంతో నిజంగానే వైసీపీకి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.