Unstoppable 2: అన్ స్టాపబుల్2 సెకండ్ ఎపిసోడ్ గెస్టులుగా హాజరైన యంగ్ హీరోస్?

Unstoppable 2: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. నటుడిగా అందరిని మెప్పించిన బాలకృష్ణ వ్యాఖ్యాతగా కూడా తనదైన శైలిలో సందడి చేస్తూ అందరినీ మెప్పించారు. ఈ కార్యక్రమానికి ఊహించని స్థాయిలో ఆదరణ రావడంతో నిర్వాహకులు సీజన్ 2 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కూడా ప్రస్తుతం ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ పొందుతుంది.

ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమం ఎంతో ఆదరణ సంపాదించుకుంది. ఈ అక్టోబర్ 14వ తేదీ ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమై మొదటి సీజన్ కి మించి రెండవ సీజన్ ఆదరణ పొందింది ఇకపోతే మొదటి ఎపిసోడ్ పూర్తి కావడంతో రెండవ ఎపిసోడ్ పై కూడా భారీ అంచనాల పెరిగాయి. అయితే తాజాగా రెండవ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా యంగ్ హీరోస్ సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఈ యంగ్ హీరోలతో కలిసి ఆడి పాడి పెద్ద ఎత్తున సందడి చేస్తున్నట్లు అర్థమవుతుంది. ఇకపోతే హీరోలతో కలిసి బాలకృష్ణ ఏకంగా డాన్సులు కూడా వేశారు.ఈ క్రమంలోని సిద్దు జొన్నలగడ్డ బాలకృష్ణ గారిని ప్రశ్నిస్తూ మీకు ఏ హీరోయిన్ అంటే క్రష్ అని అడగగా వెంటనే బాలయ్య తనకు రష్మిక మందన్న అంటే క్రష్ అని షాకింగ్ సమాధానం చెప్పారు.

ఇకపోతే సిద్దు జొన్నలగడ్డను కూడా నీకు ఏ హీరోయిన్ అంటే క్రష్ అని బాలయ్య ప్రశ్నించగా తనకు ప్రజెంట్ కియారా అద్వానీ అంటే క్రష్ అని సిద్దు జొన్నలగడ్డ సమాధానం చెప్పారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి ఫోన్ చేసి త్రివిక్రమ్ నా షోకి ఎప్పుడు వస్తున్నావ్ అంటూ ప్రశ్నించారు. వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ మీరు ఊ అనాలే కాని ఇప్పుడే వచ్చేస్తాను అంటూ సమాధానం చెప్పారు. అయితే వచ్చేటప్పుడు ఎవరిని తీసుకురావాలో నీకు తెలుసు కదా వారితోనే ఈ షో కి రావాలి అంటూ బాలయ్య త్రివిక్రమ్ శ్రీనివాస్ కు సరదాగా తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు.మొత్తానికి ఈ ప్రోమో పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని చెప్పాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -