Veera Simha Reddy: వీరసింహారెడ్డిలో బాలయ్య అలా చేస్తారా.. వీర లెవెల్ లో ఉంటాయంటూ?

Veera Simha Reddy:  బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసినటువంటి టీజర్ పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. బాలయ్య వెండితెరపై నటన విశ్వరూపాన్ని చూపించడమే కాకుండా ఆయన ఎక్కువ వీర, రౌద్ర విన్యాసాలను తెరపై ఎలా పండించగలరో మనకు తెలిసిందే.

ఇప్పటికే బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, లెజెండ్, అఖండ వంటి సినిమాలన్నీ కూడా ఇలాంటి కోవకు చెందినవి.ఇక ప్రస్తుతం ఈయన నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా కూడా ఇదే తరహాలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇన్ని రోజులపాటు NBK 107అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను జరుపుకున్న ఈ సినిమాకు కొండారెడ్డి బురుజు వద్ద ఏకంగా ఈ సినిమా టైటిల్ ను ప్రకటించారు.ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ప్రకటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఈ సినిమాలో కూడా బాలయ్య తన వీర విన్యాసాలతో ప్రేక్షకులను సందడి చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాలో గోపీచంద్ బాలయ్య పై గుగుర్పొడిచే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ సన్నివేశాలు వేరే లెవల్లో ఉంటాయని సమాచారం. అయితే ఇలాంటి పోరాట సన్నివేశాలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 సన్నివేశాలు ఉన్నాయని ఈ విన్యాసాలను కనుక చూస్తే కచ్చితంగా మతులు పోవాల్సిందేనని తెలుస్తోంది.

మొత్తానికి అఖండ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత బాలయ్య మరోసారి తన వీర లెవెల్ చూపించడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇక క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన గోపీచంద్ మలినేని బాలకృష్ణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మరి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారని తెలుస్తోంది.ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న నేపథ్యంలో శరవేగంగా షూటింగ్ పనులను జరుపుతున్నారు. మరి వీర సింహారెడ్డి ప్రేక్షకులను ఎలా సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -