Shriya Saran: స్టేజీపైనే శ్రియ ముద్దులు పెట్టింది.. ఎవరికో తెలుసా?

Shriya Saran: ఇరవై ఏళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల యువతను ఆకట్టుకున్న సినిమా నువ్వే-నువ్వే. ఆ సినిమాను చూడని వారుంటారు. నాటి పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. తరుణ్- శ్రేయ జంటగా నటించిన ఆ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. నువ్వే-నువ్వే సినిమా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సినిమాలో పని చేసిన నటీనటులు, దర్శక నిర్మాతలు చిన్న చిన్న నటులంతా కలిసి ఆ సినిమాని స్పెషల్‌గా వీక్షించారు. నాటి గుర్తులు నెమరేసుకున్నారు.

ఈ సందర్భంగా స్టేజి పైన ఆ సినిమాలో నటించిన వారందరూ ఉండగా శ్రియ మాట్లాడింది. ఈ సందర్భంగా సినిమాల్లో కొన్ని డైలాగ్‌లు స్టేజీపై గుప్పించారు. అంతలోనే శ్రియ అందరూ చూస్తుండగానే, తరుణ్‌ను పొగుడుతూ వెంటవెంటనే ముద్దులు పెట్టింది. దాంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయిన శ్రియ ఏ మాత్రం సంకోచించకుండా మళ్లీ ముద్దులు పెడుతూనే ఉంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు. అసలైన జంట అంటే తరుణ్‌-శ్రియ అని కొందరు. సినిమాలో మిస్సయిన కిస్సులు ఇప్పుడు ఇచ్చిందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

CM Jagan: కూటమి విజయాన్ని ఫిక్స్ చేసిన జగన్.. మేనిఫెస్టో హామీలతో బొక్కా బోర్లా పడ్డారా?

CM Jagan: త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలలో నిర్వహిస్తున్నారు. అయితే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటూ ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు....
- Advertisement -
- Advertisement -